"నేమముగ జపతపము సలిపి" ఇక్కడే వుంది అసలు కిటుకంతా.... "సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కారాసేవితో దృఢభూమిః" ఇలా సాగాలి భగవదారాధన. చక్కని పాటనిచ్చారు మాష్టారూ.
వివిధ సందర్భాలలో ఆ పద్యరాగాలలో చక్కగా ఆలపించారు. మీరు ఆలపించిన పద్యాలు కాకుండా.... పాఠ్యపుస్తకములోనున్నవి, స్వీయపద్యాలకు సందర్భోచితంగా రాగాలను అన్వయించి ఆలపించవలసి ఉంటుంది. పద్యపఠనమైనా.. లేకా కొత్త గీతమైనా.. స్వీయస్వరకల్పనలో చక్కగా శృతిబద్దంగా గానం చేయాలంటే రాగాలు,తాళం తెలిసి ఉండాలి. ఇవి తెలుసుకోవాలంటే సంగీతంపై సాధన, కనీస అవగాహన ఉండాలి. ఇవేమీ లేకుండా... పద్యం,పాట రాగయుక్తంగా ఆలపించాలంటే చాలా కష్టం
మబ్బు తునక రాముడై, చల్లని ప్రకృతి సీతమ్మ, పుడమి పులకరించింది అనే చరణాలు అద్భత ము గా వున్నాయి. అందుకే రామ కళ్యాణం, లోక కల్యాణం ప్రతి గడపలో ఉత్సవం ప్రతి గుండె లో ఉత్సాహం . కళ్యాణ మస్తు శుభ మస్తు