ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము మానవాత్మ పరమాత్మ తో సంబంధం (యోగం) జోడించటం ఎలా. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వసుఖ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఒక ఆత్మకు చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే మా ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము..