హిందూ ధర్మ సంస్క్రృతులపై, హిందువులు పవిత్రమైనవిగా పూజించే (ఆరాధించే ) శ్రధ్ధా కేంద్రాలపైన ఎప్పుడైనా , ఎక్కడైనా అవమానం జరిగితే , మతపరమైన వత్తిళ్ళు వస్తే చట్ట పరిదిలో ఎదుర్కొనుటకు హిందూ సమాజాన్ని జాగ్రూత పరిచి వారిని దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయుటయే లక్ష్యముగా హిందూ వాహిని పని చేస్తుంది. 1986 జనవరి 12న వివేకానంద జయంతి రోజున హిందూ వాహిని ప్రారంభించబడింది. హిందూ యువశక్తిని సంఘటిత పరిచి వివిధ కార్యక్రమాల ద్వారా సమాజంలో నిద్రానమైన క్షాత్రశక్తిని జాగృతపరిచి శక్తివంతమైన సమాజ నిర్మాణ కార్యంలో నిమగ్నమై ఉంది హిందూ వాహిని.