శ్రీ మద్భగవధ్గీత ప్రవచనం వీరి అమృత గళంలో వినాలి..సమయం తెలియదు.అప్పుడే ఐపోయిందా? అనుకుంటాము..వీరి గురుదేవులు సరియైన నామధేయం పెట్టారు...శ్రీ విద్యా ప్రకాశనంద గిరి స్వామి వారికి ప్రణామములు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏
విద్యాప్రకాశానందగిరి గురువు గారి ఆత్మ కు సత్గతి కలిగించాలని ప్రార్థన ఆ దేవుని కి . ఆయన కు పాదాభివందనములు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
స్వామి, నమస్కారం.భగవద్గీతలో శ్రీకృష్ణుడు జనకుడి గురించి చెప్తూ జనకుడు కర్మయోగం ఆచరించి అదే జన్మలో మోక్షం పొందినట్లు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా? జనకుడు త్రేతాయుగంలో వాడు కదా?మరి జనకుడు ఈ జ్ఞానం ఎవరి ద్వారా తెలుసుకొని కర్మయోగం ఆచరించాడు?అని నా సందేహం.శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో భగవద్గీతా జ్ఞానం చెప్పారు కదా?త్రేతా యుగంలో జనకుడికి ఏ విధంగా ఈ భగవద్గీతా జ్ఞానం తెలిసింది? ఇది చాలా ముఖ్యమైన విషయం కనుక దయచేసి ఈ సందేహం తీర్చమని మనవి.
@@PratapreddykethaKpr కృష్ణావతారం చూపించాడని రామాయణంలో రాశారేమో తెలియదు కానీ.శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీదకి వచ్చింది ఎందుకు? అధర్మాలని వివరించి ధర్మాలు ఏవో చెప్పేందుకు వచ్చారు.అదే భగవద్గీతా జ్ఞానం ద్వారా ధర్మాలు బోధించి అధర్మాలు ఏవో చెప్పి వాటి వల్ల నన్ను చేరలేరని చెప్పారు అంటే మోక్షం లేక ముక్తి పొందలేరని చెప్పారు.మరి మీరు చెప్పినట్లు రాముడు దేవుడే అయితే ఏ ధర్మాలు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ వద్దని చెప్పిన అధర్మాల్ని కాపాడేందుకు విశ్వామిత్రుడితో వెళ్ళారు కదా? బంగారు జింక ఉండదని తెలియని రాముడు దేవుడు ఎలా అయ్యాడు అని వేమన యోగి గారు ఆయన రాసిన ఒక పద్యంలో అడిగారు. రాముడు పూర్వ జన్మల్లో చేసిన పాప పుణ్యాల ఫలితాలు ఆయన అనుభవించాడు.పుణ్య ఫలితంగా రాజ వంశంలో జన్మించారు.పాప ఫలితంగా అనేక కష్టాలు అనుభవించాడు.జీవితంలో సుఖాలు ఎంతో తక్కువగా అనుభవించి కష్టాలే ఎక్కువగా అనుభవించాడు.వాలి సుగ్రీవుల సహాయం కోరి వెళ్ళి ఏ వైరం లేకుండా వాలిని చెట్టు చాటున దాగి బాణం వేసి చంపడం ధర్మమేనా? దాని వల్ల పాపం రాదా? ఆయన చేసుకున్న కర్మల మూలంగా ఆయనకి బహు భార్యాత్వం లేదు.ఆ రోజుల్లో ఆయన తండ్రితో సహా ఎంతో మంది రాజులకి భార్యలు ఉండేవారు కదా మరి ఈయనకి కూడా ఉండవచ్చు అది కూడా సీతా వియోగం వల్ల.కానీ ఆయన కర్మానుసారంగా లేరు.గిరిజనుల సహాయం తీసుకుని రావణ బ్రహ్మతో యుద్ధం చేసి సీతమ్మని తెచ్చుకోవడంలో కొంతమంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు.అటువంటి గిరిజనుల్ని వానరులుగా చిత్రించిన ఘనత వాల్మీకి వారిది.చివరిలో లవకుశల ద్వారా సీతమ్మ ఆచూకీ తెలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళి తనతో రమ్మని అడిగితే ఆవిడ నీతో జీవించే కంటే మరణం మేలు అని కొండ మీద నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన విషయం రామాయణంలో రాసి ఉండరు.సూర్యుడు ఉత్తరం వైపు ఉంటే ఉత్తరాయణం, దక్షిణం వైపు ఉంటే దక్షిణాయనం అలాగే రాముడి వైపు రాసింది రామాయణం.రావణ బ్రహ్మ కైలాస పర్వతాన్ని ఎత్తారు అని ఈ పెద్దలే రాస్తారు,శివ ధనుస్సు ఎత్తలేక పోయారని కూడా ఈ పెద్దలే రాస్తారు.సీతమ్మ స్వయంవరం గురించి రావణ బ్రహ్మకి తెలిసే అవకాశం లేదు ఎందుకంటే సముద్రం దాటి ఎవరూ వెళ్ళగల వారు లేరు.అయినా స్వయంవరం నాటికి రావణ బ్రహ్మ వయస్సు 85 నుంచి 90 సంవత్సరాల లోపు ఉంటుంది.సీతమ్మ వయస్సు 15 సంవత్సరాల లోపు ఉంటుంది.రావణ బ్రహ్మ స్వయంవరానికి వెళ్ళలేదు.కానీ ఆయన్ని విలన్ గా చూపాలి, రాముణ్ణి హీరోగా చూపాలి.రావణ బ్రహ్మ గొప్పతనం గురించి ఒక్క జనకుడికి మాత్రమే తెలుసు కనుకనే ఆయన దగ్గర దైవ జ్ఞానం తెలుసుకొని అందులో చెప్పిన ఒక ధర్మం అయిన కర్మయోగం ఆచరించి ఆ జన్మలోనే మోక్షం పొందినట్లు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు.ఈ విషయం స్వామి వారి ద్వారా ఎవరికైనా తెలుసేమో అని అడిగాను.సీతమ్మ జననం కూడా లంకలోనే జరిగింది.జరిగి యదార్ధం రాస్తే రాముడి గురించి వాస్తవాలు తెలుస్తాయి కనుక యదార్ధం దాచి రాముడి వైపు రాసింది రామాయణం
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగం 28,విశ్వ రూప సందర్శన యోగం 48,53 శ్లోకాల్లో చెప్పిన యజ్ఞాలు యాగాలు, వేదాధ్యయనాలు దానాలు ఘోర తపస్సులు అధర్మాలని వాటి వల్ల నన్ను చేరలేరని అంటే మోక్షం పొందలేరని చెప్పారు కదా? ఇలా అధర్మాలు ఇవని చెప్పి ధర్మాలు ఏవో కూడా చెప్పి ధర్మాలు ఆచరించి కర్మల్ని నాశనం చేసుకుని ముక్తి పొందమని చెప్పారు కదా స్వామి.మరి ఇప్పుడు కూడా అవే ఆచరిస్తూ ఉన్నాం ఎందుకు? అలాగే చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అనే శ్లోకం వివరం నాలుగు కులాల్ని పరమాత్మ సృష్టించినట్లు చెప్పారు.దేవుడు ఇలా కులాల్ని సృష్టిస్తారా?ఈ సందేహాలు తీర్చమని మనవి