ప్రకృతి అనేది భగవంతుని సృష్టి. ఈ ప్రకృతి అందాలు, సంపద మానవులకి, పశు పక్ష్యాదులు అన్నింటికీ చెందుతాయి. స్వాతంత్రము వచ్చి ఇన్ని సంవత్సరాలు ఐనా కూడా ఈ రాజరిక వ్యవస్థ ఆనవాళ్ళు పోలేదు. ఉన్నవారికి మాత్రం వందల ఎకరాల భూమి ఉంటుంది. లేని వారికి ఒక ఎకరా భూమి ఉండదు. అందుకే కమ్యునిజం మొదలై క్రమంగా తిరుగుబాట్లు జరిగాయి.