#Raitunestham #Integratedfarming
వనపర్తి జిల్లాకు చెందిన రవి సాగర్... 7 ఏళ్లుగా ప్రకృతి సేద్య విధానంలో సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. 5 ఎకరాల్లో ప్రధాన పంటగా మామిడి, ఇందులో అంతర పంటలుగా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. ఎకరంలో జామ, మరో 2 ఎకరాల్లో బొప్పాయి నాటారు. వీటిలోను అంతర పంటలు వేశారు. సుస్థిర ఆదాయం కోసం నాటుకోళ్లు పెంచుతున్నారు. ప్రకృతి ఎరువులు విక్రయించి వాటి ద్వారా కూడా రాబడి పొందుతున్నారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా, తమ భూమిలో వీలైనన్ని ఎక్కువ రకాల పంటలు సాగు చేయాలని, పశు - జీవ సంపద పెంచుకోవాలని రవిసాగర్ సూచిస్తున్నారు. తద్వారా రైతులు సుస్థిర ఆదాయం అందుకోవచ్చని వివరించారు.
సమీకృత వ్యవసాయం, తోటల పెంపకం, పంటల యాజమాన్యం, నాటుకోళ్ల పెంపకం తదితర అంశాలపై మరింత సమాచారం కోసం రవి సాగర్ గారిని 93473 19232 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
4 окт 2021