హరిశ్చంద్రుని పద్యం ఉదహరించారు,.. బాలసూర్య... అనే పద్యం రంగస్థల నటులు అంత గంభీరమైన స్వరము తో పాడటానికి గల కారణం, చంద్రమతి బంగారు మాంగల్యాన్ని మెడలో దాచుకుని ఏమీ లేదంటుందనే కోపం హరిశ్చంద్రుడికి అందుకని కోపాన్ని ప్రదర్శించడానికి ఆ రాగం.. ముఖ్యమైన విషయం ఏమిటంటే కాటిసీను లో హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు కాడు వీరదాసుడు. కుల దురహంకానికి బలియై గుడికి, బడికి దూరమై వల్లకాటికి అధికారమొచ్చిన దుష్ట బుద్ధి కి కరుణ తలంపగ ఎక్కడిదీ అంటాడు వీరదాసు... హరి హర పూజంలందొలిగి.... అనే పద్యం కాటి కాపరులగా వున్న కులం వారి దీన స్థితికి అద్దం పడుతుంది. కాబట్టి కులంతో పీడింప బడిన కాఠిన్యం అయిన వీరదాసుని గుండె కరుణ రసమొలికేలా ధీనస్వరం పలకటం అసహజం. 🙏
మీ పద్యం కర్ణపేయంగా కాదు కర్ణ కఠోరంగా ఉంది ఇలాగే తరగతిగదిలో పద్యం చదివితే తరగతి గదిలోని పిల్లలే కాదు పక్క క్లాసులలో ఉండే పిల్లలు కూడా పారిపోతారు రంగస్థలం మీద చదివినట్లుగా తరగతి గదిలో చదవకూడదండీ బాబూ.