#raitunestham #millets #kadharvalli
కృష్ణా జిల్లా గన్నవరంలోని ఆత్కూరులో... స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో మార్చి 26న.... చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరిగింది. ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో.. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి పాల్గొన్నారు. చిరుధాన్యాలు, ఆకుల కషాయాలు, ప్రకృతి జీవన విధానాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే విధానాలను వివరించారు. సదస్సులో స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రతినిధులు, రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలు, మిల్లెట్స్ వంటకాలు, వ్యవసాయ - అనుబంధ రంగాల పుస్తకాలను ప్రదర్శించారు.
---------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • జీరో సైడ్ ఎఫెక్ట్స్ తో...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham
3 апр 2023