విజయం వైయస్ ఆర్ సిపి దే
శాసనసభ్యులుడాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి: జూన్ 4 న ప్రకటించే ఫలితాలలో అంతిమ విజయం వైఎస్సార్సీపి దే అని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇటీవల ఎన్నికలలో సత్తి సూరారెడ్డి వెంకటరెడ్డిబ్రదర్స్ ఆధ్వర్యంలో పొలమూరు పరిసర గ్రామాల నుండి పెదపూడి మండలం వెళ్లి వివిధ గ్రామాలలో పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్న సుమారు 200 మందిని శుక్రవారం పొలమూరులోని దేవి కళ్యాణ మండపం నందు జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు ముఖాముఖి నిర్వహించి పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ సత్తిసూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక పోలింగ్ నమోదు కావడం ప్రభుత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసం అని ఆ విశ్వాసంతోనే ఓటర్ తమ ఓటు హక్కు వినియోగించుకుని వై ఎస్ ఆర్ సి పి ని గెలిపించనున్నారని తన విజయం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి పై ఎన్ డి ఏ కూటమి అసత్య ప్రచారాలు చేసిందని ఓటర్లు గమనించి ఈ రాష్ట్రంలో సంక్షేమం జరగాలంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవసరమని గుర్తించారని అందుకేఫ్యాన్ గుర్తుకు ఓటు వేశారని శాసనసభ్యుడిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడిగా గూడూరి శ్రీనివాస్ గెలవడం ఖాయమని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మరొకసారి వైఎస్సార్సీపి ప్రభుత్వం కొలువు తీరుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి, పెదపూడి మండల పార్టీ కన్వీనర్ గుత్తుల రమణ, పెదపూడి మండలం వైయస్సార్సీపి ఎన్నికల ఇంచార్జ్ కోనాల శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ గుడాల ధనలక్ష్మి, ఎంపీటీసీ సత్తి కనకా రెడ్డి పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు
16 май 2024