రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించి.. ఆవు పేడను ఎరువుగా ఇస్తూ బత్తాయి (చీని) సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. 27 సంవత్సరాల తోటలో ప్రస్తుతం చెట్లు చనిపోవడం కూడా తగ్గిందని.. పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు దిగుబడి పెరిగిందని రైతు తెలిపారు. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో ఈ రైతు సుమారు 40 ఎకరాల భూమిలో పలు రకాల బత్తాయి సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 27 ఏండ్ల బత్తాయి (చీని) తోట ఇది.. రసాయన ఎరువులు బంద్ | రైతు బడి
#RythuBadi #రైతుబడి #mosambi
17 окт 2024