స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.
సాంప్రదాయ అల్పాహారాల సహజ రుచుల ఆస్వాధనకు పంతులు గారి ఆహారశాల నెలవు.
అల్పాహారాల తయారీలో నాలుగు దశాబ్దాల పంతులుగారి శ్రేష్టతే ప్రామాణికం.
పంతులుగారి అల్పాహారాలు రుచి శుచితో ఆరిగించిన వారు సంపూర్ణ సంతృప్తి వ్యక్తపరిచేలా ఉన్నతమైన స్వభావం కలిగి ఉంటాయి.కనకునే పురవాసులు ప్రసిద్ధి చేకూర్చడంతో 40 ఏళ్ళ విశిష్టతను పంతులుగారి ఆహార శాల గడిచింది.
వారి వద్ద లభించు అల్పాహారాలలో ప్రాముఖ్యమైన పులి బొంగరం దోశ .కనకపు వర్ణంలో శోభితంగా వీక్షణానికి ఇంపుగా ఉంటుంది.అరిటాకులో మనకు అందించిన దోశ వెంటనే తినేలా ప్రేరేపించడమే కాదు.ఆహ్లాదాన్ని పంచుతుంది. దోశ మందంగా ఉన్న మృదువుగా ఉంటుంది. వారు ఇచ్చిన పచ్చళ్ళును దోశకు అలా అద్దుకుని నోటికి అందిచగానే రుచి కాస్త పులి బొంగరంవలే ఉండి వైవిధ్యంగా సంప్రదాయతను ప్రతిబింబిస్తుంది.అలా సుతారంగా బొజ్జలోకి జారుకుంటుంది.
ఇప్పుడు పంతులు గారు తమ ఆహార శాల గూర్చి వివరిస్తారు తదుపరి నేను పులి బొంగరం దోశను ఆస్వాధిస్తాను.
పంతులు టిఫిన్ సెంటర్, పప్పు బజార్, గాంధీ రోడ్, ఒంగోలు.
9 сен 2024