హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్. అంత్య కాలంలో జీవుడు ఏ భావనతో మరణిస్తాడో, వచ్చే జన్మ ఆ భావన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, అంత్యకాలంలో భగవనామం తలిస్తే భగవంతుడు దగ్గరికి వెళ్ళ వచ్చు. కానీ, ఆ సమయంలో అది గుర్తుకు వస్తుంది అనే భరోసా లేదు. కాబట్టి, ఎల్లప్పుడూ భగవంతుడు నామం తలుసుకుంటూ మన పనులు చేసుకుంటూ వుంటే అప్రయత్నంగా - అంత్యకాలంలో భగవంనామం తలిచి - ఆదైవాన్ని చేరుకోవచ్చును. అదే విషయం శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత లో ఈ విధంగా 👇చెప్పాడు : ▪️యం యం వాపి స్మరన్భావం త్యజత్యన్తే కలేవరమ్| తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః|| 8-6 || ▪️తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ| మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయః|| 8-7 |l *భావం* : ▪️"కుంతీ కుమారా మరణ సమయంలో ఏవిషయాన్ని స్మరిస్తూ మానవుడు కళేబరాన్ని ( శరీరాన్ని ) వదులుతారో, నిత్యమూ ఆ విషయాన్నే తలచుకోవడం చేత - దానినే పొందుతారు. అందుచేత, నువ్వు అన్ని కాలాలలోనూ నన్నే( దైవాన్ని ) స్మరించు, యుద్ధం చెయ్యి ( నీపని నువ్వు చేసుకో - అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేస్తాడు, తక్కిన వాళ్ళు - వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండాలి ). మనో బుద్ధులను నాకు సమర్పించిన నీవు - నన్నే పొందుతావు ( you will attain divinity - నీకు మోక్షం వస్తుంది ) . ఈ విషయంలో సందేహం లేదు." కాబట్టి, అంతా ఈ విషయం గ్రహించి - సదా దైవ నామం తలుస్తూ వుండండి. మీకు సందేహాలుంటే నన్ను సంప్రదించండి : (C) 6300226286 - between 3-00 to 5-00 pm. హరిః ఓమ్.