ఖలేజా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను చాలా కాలం పాటు పక్కన పెట్టారు. మధ్యలో ఒక ప్రాజెక్టు అనుకున్నా... స్టోరీ నచ్చకపోవడంతో మహేష్ బాబు వదులుకున్నాడు. త్రివిక్రమ్ మీద మహేష్ కు నమ్మకం రావడానికి చాలా సంవత్సరాలే పట్టింది. అయినా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ డిసప్పాయింట్ చేశారు. హనుమాన్ సినిమా ఎఫెక్ట్ కూడా ఈ సినిమాపై పడింది. హనుమాన్ సినిమా ను రిలీజ్ కానీయకుండా గుంటూరు సినిమా యూనిట్ ప్రయత్నించిందనే విమర్శలు కూడా ఈ సినిమాపై నెగటివ్ రావడానికి మరొక కారణం. ఏదేమైనా గుంటూరు కారం సినిమాకు రావలసిన డబ్బులు అయితే వచ్చాయి కానీ... సూపర్ హిట్ టాక్ రాకపోవడం మహేష్ అభిమానులకు నిరాశ కలిగించేదే. కుర్చీని మడత పెట్టి అనే పాట మహేష్ స్థాయి వ్యక్తికి అస్సలు సూట్ కాదు. మాస్ ను మెప్పించడం కోసం మరీ అంతగా దిగజారాల్సిన అవసరం లేదు. ఇది కూడా సినిమా ప్రమోషన్ సమయంలో నెగటివ్ గా పనిచేసింది. ఇక ఆశలన్నీ రాజమౌళి సినిమా పైనే. మధ్యలో మరో సినిమా ఉండవచ్చు.