*యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః I మాయాకారో మాయయా బాధితవ్యః సాధ్వాచారః సాధుమా ప్రత్యుపేయః II ---శాంతిపర్వం(మహాభారతం) శ్రీ కృష్ణ పరమాత్మ.* ఎవడు ఎవనియందు ఎట్లు వర్తించు చున్నాడో, వాడు వాని పట్ల అట్లే వర్తించుట ధర్మము. మాయా చారునితో, మాయావిగను, సాధుశీలునితో సాధువుగను ప్రవర్తించుట న్యాయమే.- శ్రీకృష్ణ 🚩🕉️🙏 పరాశర స్మృతి:- క్షత్రియోః హి ప్రజా రక్షాంశస్త్రపాణిః ప్రదండవాన్ నిర్జిత్య పరసైన్యాది క్షితిమ్ ధర్మేణ పాలయేత్ (1.61) ‘అన్యాయము, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం. శాంతిభద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే, అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మ బద్దంగా పాలించటానికి తోడ్పడాలి’. అంతేగాని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అనడం ధర్మం కాదు... చేతగాని తనం... అర్జునుడు నపుంసకుడిలా ఏడిస్తే, ధర్మాన్ని నిలబెట్టడం కోసం హింస తప్పులేదు, ఎందుకంటే లోకంలో ధర్మం నిలబడకపోతే, మనిషి అనేవాడు మిగలడు, క్రూర జంతువులు మిగతాయి. *శిష్ట రక్షణ దుష్ట శిక్షణ* (ఇది యూనివర్సల్ లా) అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ వారసులం మనమంతా... ఇదే సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని చట్టాలు అమలుపరుస్తున్నాయి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, తప్పు చేయని వాడిని రక్షించాలి. తప్పు చేసినవాన్ని శిక్షించకుండా, అప్పుడు కూడా మానవత్వం అని వదిలేస్తే, ఆ తప్పు చేసిన వాడు మారడు. ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు.ఆ తప్పుల వల్ల ధర్మంగా బతికే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఎవడో తాగి డ్రైవింగ్ చేస్తూ, అసలు తాగే అలవాటే లేని వాడిని గుద్ధి చంపేస్తే ఎవరిది తప్పంటారు? కొంతమంది ఏమంటారు అంటే, హింసా చేయడం తప్పు కాదండి. కాబట్టి మనం బ్రతికినన్ని రోజులు అహింసతో బతుకుదాం అని చెబుతారు. అలా అయితే మన భారతదేశ బార్డర్ లో ఉన్న ఆర్మీ ఆఫీసర్లు కూడా అహింసను పాటిస్తామంటే దేశంలో ఉన్న అహింసావాదులు ప్రశాంతంగా బతకలేరు. ఉగ్రవాదులు విపరీతంగా పెరిగిపోతారు. దేశం దోచుకోబడుతుంది. ఎందరో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని పరిస్థితులలో అహింస గొప్పది కాదు. కొన్ని పరిస్థితులలో హింసనే గొప్పది. చత్రపతి శివాజీ కూడా హింస పాపమని అనుకుంటే, యుద్ధం చేసేవారు కాదు.మనం ఇప్పుడు హిందువులుగా ఉండేవాళ్ళం కాదు. అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునునికి యుద్ధం చేయమని చెప్పేవాడు కాదు. అసలు హిందూ దేవి దేవతల చేతులలో ఆయుధాలు ఉండేదే ధర్మం కోసం యుద్ధం చేయమని... అలా యుద్ధం చేయబట్టే హిందువులకు ఇప్పుడున్న భారతదేశమైనా మిగిలింది. లేకుంటే హిందువులకు హిందూ మహాసముద్రమే దిక్కు... ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
Namaskaramulu,I roju china swamy vari anugrah nhasham samajika abhivrudhi y vidanga vheppi cheyyalo vipuleekarincharu.ivekakunda samajika seva kryakramalu kooda kanspadsli ex.ramakrishna misstion tharahaalo.....nanaskaaramulstho....ssrao 85 years guntur....
Jagadgurus'.prouncements are to be followed by every human being since they lead us towards the path of devinity As long as we live we will be pure pious and blissful