సిరిసిల్లలోని సహకార విద్యుత్తు సరఫరా సంఘం-సెస్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న లెక్కింపు కోసం అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24న 15 డైరెక్టర్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 87వేల130 ఓట్లకు గానూ.... 73వేల180 పోలయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 7 గదుల్లో.... పక్కనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 గదుల్లో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఇందుకోసం 76 మంది సిబ్బందిని నియమించారు. తక్కువ ఓట్లున్న వీర్నపల్లి, రుద్రంగి, వేములవాడ గ్రామీణం, వేములవాడ-2 డైరెక్టర్ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో టేబుల్ ఏర్పాటు చేయగా... మిగతా మండలాల డైరెక్టర్ స్థానాలకు సంబంధించి 2 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్ కు ముగ్గురు సిబ్బందిని నియమించారు. 50 ఓట్లను ఒక కట్టగా కట్టిన అనంతరం.... లెక్కింపు ప్రారంభమైంది. ప్రతి కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘా, పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. 75 మంది అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ , ఎలక్షన్ అథారిటీ సుమిత్ర ఆధ్వర్యంలో అభ్యర్థుల సమక్షంలో బాక్స్ లు సీల్ తీసి లెక్కింపు ప్రారంభించారు.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
15 сен 2024