Sri DattaVijayanandaTeertha Swamiji First speech.
*ఉత్తర పీఠాధిపత్య పట్టాభిషేకము*:
దత్తపీఠ విద్యాధికారి శ్రీకుప్పా వేంకట కృష్ణమూర్తిగారి ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామి వారికి సన్యాసదీక్ష ప్రదానం మైసూరు ఆశ్రమంలో జరిగింది. ది. 28.5.2004 నాడు ప్రాయశ్చిత్త కాండ జరిగింది.
ది. 29.5.2004 నాడు, ఆశ్రమంలోని సప్తర్షి సరోవరం దగ్గర ఉదయం అసలు సంన్యాస సంకల్ప దీక్ష చేయించబడి, *పూజ్య శ్రీ స్వామీజీ వారిచే దీక్షా వస్త్రాలు, సంన్యాస దండం, శ్రీబాలస్వామివారికి ఇవ్వబడినవి*.
సన్యాసదీక్ష ఇది బహిరంగ చిహ్నాలు మాత్రమే. అసలైన దీక్షా ప్రదానం ఆంతరంగికమైనది.
తదుపరి, విశ్వ ప్రార్థన మందిరంలో ఆదిగురు దత్తాత్రేయులవారి గుడి ముందు జరిగిన అత్యంత చారిత్రాత్మకమైన, విశేష కార్యక్రమంలో, మంత్రపూర్వకంగా అభిషేకం చేసి, *జ్యేష్ఠ శుద్ధ దశమి
సింహలగ్నంలో, గం 12-54 ని|లకు విశేషమైన సన్యాస దీక్షా ప్రదానం చేశారు. తరువాత శ్శిష్యుడిని దత్తగుడిలోకి తీసుకువెళ్ళి, తలుపులు మూసి, దీక్షామంత్రాన్ని, శక్తిపాతాన్ని, నూతన నామధేయం
అనుగ్రహించారు*. ఇది సన్యాసదీక్ష భాగంగా జరిగిన అంతరంగిక దీక్షా ప్రదానం. తదనంతరం శ్రీస్వామీజి వారు
నూతన స్వామివారిని బయటకు తీసుకు వచ్చి, అశేష భక్త జనులందరి మధ్య శ్రీబాలస్వామివారి నూతన నామధేయాన్ని శ్రీశ్రీశ్రీ దత్తవిజయానందతీర్ధ ప్రకటించారు..
ఈ సందర్భంగా పూజ్యశ్రీ స్వామీజీ ఇలా అనుగ్రహ భాషణం చేశారు.
సంన్యాసదీక్ష
జయగురుదత్త. ఈ రోజు జరిగిన సన్యాసదీక్ష కార్యక్రమం దత్తాత్రేయుడు, జయ లక్ష్మీమాత, మా కులదేవత లక్ష్మీ నరసింహ స్వామి వారు. వీరందరి ఆజ్ఞ ప్రకారం, నా గురువులు శ్రీ నరహరి తీర్థ అభిష్టం మేరకు జరిగింది. సమస్త దేవతలు సాక్షీభూతంగా ఈ కార్యక్రమం జరిగింది. దత్త పీఠ నిర్వహణకు, దాని పరిరక్షణకుఇక్కడ ఈ శిష్యుడిని నిర్ణయించుకున్నాను ఆయనకు వేదం నేర్పించడం జరిగింది. ఈ పీఠాన్ని, ఈ పీఠానికి వచ్చే భక్తులందరికీ, సంరక్షించే, వారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేసి, *నాకు పీఠకార్యాలలో సహకరించని ఈ శిష్యుడు ని నేను ఆజ్ఞాపిస్తున్నాను .ఈ పదాలన్నీ సువర్ణాక్షరాలతో, సువర్ణ లిఖితాలు. ఈ పీఠంలో ఈ రోజు నుంచి కొత్త శకం ప్రారంభమైంది. *నేను కేవలం అవధూతను, సన్యాసి ని, బ్రహ్మచారిని మాత్రమే కాదు. నేను ఆవతార పురుషుడిని. పీఠంలో నేను యతీశ్వర సంప్రదాయాన్ని శ్రీపాద శ్రీవల్లభ సాంప్రదాయ రూపంగా నెలకొల్పాలనుకున్నాను. నా ఈ కల ఈ రోజు నెరవేరింది
అతి విశేషమైన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమైన పాత భక్తులు చాలా మంది తిలకించారు. నా తండ్రిలాంటి శ్రీ ఆర్, వెంకట్రామ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. నా కళ్ళలోకి ఆనందభాష్పాలు వచ్చాయి. అశ్రమ పిల్లలందరు నన్ను ఎంతో ప్రేమిస్తారు. సున్నితమైన నిస్సారమైన ఈ ప్రేమ నన్ను కదిలించివేస్తోంది. ఏ పురాణాలలో కూడా ఇలాంటి ప్రేమ వాత్సల్యాలను
గురించి నేను చదువ లేదు. ఎవరైనా నిజమైన ప్రేమ వాత్సల్యాలను చూడాలంటే ఈ ఆశ్రమానికి రావాలి. ఆరు సంవత్సరాల వేద విద్యార్థులు కూడా స్వామీజీ పట్ల ఎంతో ప్రేమ కనబరుస్తారు. నేను ఈ రోజు సంతోషంగా ఉన్నాను.
కొత్త సన్యాసికి నా ఆశీస్సులను అందజేస్తూ, కొత్త పేరును ప్రకటిస్తున్నాను. నిజానికి సర్వసంగ్ పరిత్యాగియైన సన్యాసికి ఏ పేరూ ఉండకూడదు. కానీ వ్యవహారానికి, సంబోధన, పేరు కావాలి. అందుకే కొత్త పేరు శ్రీ దత్త విజయానంద తీర్థ అని ప్రకటిస్తున్నాను. జయ అనేది *జయలక్ష్మీ మాత*, *ఆనంద అనేది స్వామీజీ*, *తీర్థ అనేది నరహరి తీర్థస్వామి పేర్ల నుండి తీసుకున్నాను*. *దత్త అనేది దత్త పీఠానికి ప్రాతినిధ్యం వహిస్తుంది*. తీర్థ అంటే అమృతమని కూడా అర్థం. ఈ పేరులో 9 అక్షరాలున్నాయి. ధర్మాన్ని రక్షించడంలో ఆయన సఫలీకృతుడు కావాలి. నా భక్తులందరినీ కొత్త స్వామికి సహకరించవలసినదిగా ఆజ్ఞాపిస్తున్నాను.
ఆయన ఆశీస్సుల కోసం వచ్చేవారికి వారి జీవితాలలో అమృతం వర్షించనీ.
ఇక మీదట ఎవరూ కూడా ఆయన్ని ఏకవచనంలో సంబోధించకూడదు. అధికారిక కార్యక్రమాలలో తప్ప మాములుగా ఎవరూకూడా పేరుతో సంబోధించవద్దు . అలాంటి సందర్భాలలో పేరుకు ముందు శ్రీశ్రీశ్రీ అని మూడుసార్లు ఉపయోగించాలి .
6 сен 2013