పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య స్ఫూర్తితో ... హైదరాబాద్ లోని S.R నగర్ లో "గురుస్థాన్" పిరమిడ్ ధ్యానస్థలిని "వసుధైక ఫౌండేషన్" వ్యవస్థాపకులు శ్రీ నాగేంద్రం పేరం గారు September 11 , 2022 న స్థాపించారు. "గురుస్థాన్"లో ప్రతిరోజు సాయంత్రం సామూహిక ధ్యానం , ధ్యానీభవ పేరుతో ప్రతి నెల 11 నుండి 30 వరకు 21 రోజుల ఉచిత ధ్యానశిక్షణ తరగతులు నిర్వహించడం,ప్రతి పౌర్ణమి మరియు అమావాస్యలకి ప్రత్యేక సామూహిక ధ్యానాన్ని నిర్వహించడం, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కొన్ని వేల ధ్యాన కరపత్రాలని పంచడం జరిగింది. 10,000 మందికి పైగా కొత్తవారికి ధ్యానాన్ని పరిచయం చేయడం ,40 కి పైగా వన్ డే వర్క్ షాప్ లు ఏర్పాటు చేయడం,విద్యార్థుల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం కోసం రెండు సమ్మర్ క్యాంప్ లు ఏర్పాటు చేయడం,గురు ప్రసాదం పేరుతో ప్రతిరోజు మధ్యాహ్నము మరియు రాత్రి సమయాలలో ధ్యాన సాధకులకు నిత్య అన్నదానాన్ని అందిస్తున్నాం.