వంగలో 90 శాతం పుచ్చులు రావడంతో పంట తీసేందుకు సిద్ధమయ్యారు ఈ యువరైతు. కానీ తోటలో పని కోసం వచ్చిన కూలీల సలహాతో.. ఇంగువ ద్రావణం మొక్కలకు పోసి తిరిగి పంట దిగుబడి పొందారు. 90 శాతం పుచ్చుల సంఖ్య.. ఇంగువ ద్రావణంతో 10 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఆ ఇంగువ ద్రావణం తయారీని, ఖర్చు, వాడే విధానంను ఈ వీడియోలో వివరించారు. ఈ యువ రైతు పేరు రామడుగురు రాము గారు. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం ఘణపురంలో రాము గారు.. తన సోదరుడు రామడుగు రామకృష్ణ గారితో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఈ సోదరులు ఇద్దరూ మరోవైపు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా కూడా పని చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఇంగువ ద్రావణంతో వంకాయ చేనుకు తిరిగి ప్రాణమొచ్చింది | Hing Liquid | రైతు బడి
#RythuBadi #రైతుబడి #ఇంగువద్రావణం
8 мар 2021