మహబూబ్ నగర్ జిల్లా గండ్వీడ్ మండలంలోని జక్లపల్లి గ్రామంలో బస్వరాజు గారు తన మిత్రుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఈ ఎద్దు గానుగ నూనె పరిశ్రమ నడుపుతున్నారు. ఈ సందర్బంగా తాము మాత్రమే కాదు ఇంకా కొందరు బాగుపడాలి అన్న ఉద్యేశంతో వారు రెండురోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎద్దు గానుగల ద్వారా నూనెను తీసే విధానం, లాభ నష్టాలు అన్నీ కూడా రెండురోజుల పాటు వివరించారు. అన్ని రకాల మిల్లెట్స్ వంటలు రుచి చూపించారు. చాలామంది తమ జీవితంలో చూడలేని, తినలేని భోజనం చేయగలిగారు. వచ్చిన వారు అందరూ చాలా సంతోషంగా వెనుదిరిగారు.
9 янв 2022