ఏటికేడు అన్నదాతల పెట్టుబడి ఖర్చు పెరిగిపోతున్నా దిగుబడులు మాత్రం పెరగడంలేదు. ముఖ్యంగా కూరగాయలసాగు చేస్తున్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో ఏటికేడు పంటవేయడం కంటే ఒకసారి వేసిన పంట ఐదేళ్లవరకు దిగుబడులు ఇస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు తగ్గిపోతుంది. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? గ్రాఫ్టింగ్ పద్ధతిలో కూరగాయలను సాగుచేస్తే ఒకసారి వేసిన పంట ఐదునుంచి ఎనిమిదేళ్లవరకూ దిగుబడినిస్తుంది. అంతేకాదు సంప్రదాయ పద్ధతులతో పోల్చితే దిగుబడులు మూడురెట్లు పెరుగుతాయి. ప్రధానంగా వంగ, టమాట, మిర్చి, క్యాప్సికమ్ సాగులో రైతులపాలిట వరంగా పనిచేసే గ్రాఫ్టింగ్ పద్ధతిపై మరిన్ని వివరాలను రవిచంద్ర మాటల్లో తెలుసుకుందాం.
contact
ravichandara
mobile no : 9581242255
1 апр 2018