మిద్దె తోట అంటే అందరికీ గుర్తొచ్చేది మట్టి, సిమెంట్, ప్లాస్టిక్ కుండీల్లో మొక్కల పెంపకం. నగరాల్లో చాలామంది ఈ పద్ధతిలోనే కూరగాయలు, పళ్లను పండిస్తున్నారు. కానీ కుండీలను ఒకచోటినుంచి మరోచోటికి మార్చడం, మొక్కలకు నీటిని పోయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా హైదరాబాద్ బంజారాహిల్స్కి చెందిన రాజశేఖర్ ట్రఫ్స్లో కూరగాయలు పండించడం ప్రారంభించారు. పొయినీర్ టెలికాం సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ దొరికే కాస్త తీరిక సమయంలోనే సొంతింటి కూరగాయలు తినాలనే ఆసక్తి, ఆరోగ్యంపై శ్రద్ధతో మిద్దెతోట సాగుచేస్తున్నారు. హోమ్క్రాప్ సంస్థ సహకారంతో ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘచతురస్రాకార ట్రఫ్స్లో ఏడాదిగా పూర్తి సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగుచేస్తున్నారు.
27 апр 2018