మీ మాటల్లో నాకు చాలా స్నేహ భావం... నేను రోజు వింటాను ...... స్నేహితులు, తోబుట్టువులు, బంధువులు ......వీళ్ళు అంతా అర్ధం లేనివారు. కేవలం time being మనుష్యులు మాత్రమే! కేవలం తన ఉనికి' తను మాత్రమె నిజం!
Desire....Want is the father of all Misery.! Desire brings all Misery.! Desire will not come unless there is something outside to fulfill it.! Desire is without beginning..Desire is infinite.. It's fulfilment is limited.! The satisfaction of desire only increases it as oil poured on fire but makes it burn more fiercely.! Our desires also are constantly changing..What we would prize today..We would reject tomorrow. --- Swami Vivekananda...
తొలి సామాజిక విప్లవకారుడు బుద్ధుడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో దగ్గరకు ఓ భారతీయ ప్రముఖుడు వెళ్ళి నమస్కరించాడు. తనపేరు చెబుతూ ‘ఐయామ్ ఫ్రం ఇండియా’ అన్నాడు. పికాసో వెంటనే లేచి నిల్చొని ‘ఓ యు ఆర్ ఫ్రం బుద్ధభూమి’అని చేతి లో చేయి వేశాడు. భారతదేశమంటే అతనికి బుద్ధభూమే. ప్రపంచాన్ని పట్టి పీడించే దుఃఖానికి బుద్ధుడు ‘అష్టాంగ మార్గం’లో పరిష్కారాన్ని చూపించాడు. బుద్ధుని బోధనలలో ‘అనాత్మ’ వాదం, ‘అనిత్వత’, ‘ప్రతీత్య సముత్పాద’ వంటివి బుద్ధుడిని ఇతర తత్వవేత్తల కంటే, ప్రవక్తల కంటే భిన్నం గా నిలబెట్టాయి . ‘అనాత్మ’ వాదం అంటే భౌతిక వాదం. మతాలన్ని ఆత్మ, పరమాత్మ, స్వర్గం, నరకం వంటి భావనల చుట్టూ పరిభ్రమిస్తుంటే బుద్ధుడు ఆత్మ లేదనడం ఆనాటికే కాదు, ఈనాటికీ సాహసోపేతమైన చర్య. అలాగే ‘అనిత్వత’ అనేది- మార్పును, చలనశీలతను గురించి వివరిస్తుంది . బుద్ధుని తాత్విక చింతనలో ‘ప్రతీత్య సముత్పాద’ అనేది వివిధ అంశాల మధ్య వుండే కార్యకారణ సంబంధాన్ని వివరిస్తుంది. ఇది బౌద్ధంలోని హేతువాద దృష్టికి నిదర్శనం. బుద్ధుని బోధనలలోని ‘మధ్యేమార్గం’ అన్ని అంశాలకు, అన్ని కాలాలకు సరిపోయే విధంగా ఎంతో ప్రాసంగికతను కలిగి వుంది. బుద్ధుడు అన్ని వర్గాల వారికి స్థానం కల్పించాడు..ఇది ప్రజాస్వామికమైన నిర్మాణం.కర్మకాండలు, యజ్ఞ యాగాలు, క్రతువుల పేరున జంతువులను వధించడాన్ని, మూఢాచారాలను బుద్ధుడు ఖండించాడు. హేతువుకు అధిక ప్రాధాన్యత నిచ్చాడు.. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను తాను ఫ్రెంచి విప్లవం నుంచి కాక బౌద్ధం నుంచి స్వీకరించానని అంబేద్కర్ ప్రకటించాడు.బుద్ధుని అనంతరం బ్రాహ్మణ వాదులు ఆయన అస్తిత్వాన్ని నాశనం చేసే ఉద్దేశంతో ఆయన్ని విష్ణుమూర్తి అవతారాలలో ఒక అవతారంగా చేశారు. బౌద్ధ ఆరామాలను పడగొట్టి హిందూ దేవాలయాలుగా మలిచారు. ఆంధ్ర దేశంలోని శైవ మతానికి చెందిన పంచారామాలన్నీ ఒకప్పుడు బౌద్ధ క్షేత్రాలే!. బౌద్ధాన్ని దేశం నుంచి వెళ్ళగొట్టి భారతదేశం తన ఆత్మను కోల్పోయింది అని గురజాడ వాపోయాడు.బ్రాహ్మణవాదులు కోరుకున్నట్టు బౌద్ధ ధర్మం నశించలేదు. అది భారతదేశంలో ధ్వంసం చెయ్యబడినప్పటికీ ప్రపంచమంతా వ్యాపించింది. ఈ దేశంలో పుట్టిన బౌద్ధాన్ని దేశం నుంచి తరిమివేసి చారిత్రక తప్పిదం చేసింది భారతజాతి
మరీ ఫిజికల్ నీడ్స్ ఆకలి నిద్ర మైదునం లాంటివి కాకుండా మనిషి కి ఎమోషనల్ నీడ్స్ ఉండవా. .?ఎమోషనల్ నీడ్స్ మనిషికి ప్రకృతి పరం కాదా. .?మనిషి సంఘ జీవి అంటారు. .మనిషి కి ఎమోషనల్ నీడ్స్ ఆకలి నిద్ర లా అర్జెంటు కాకపోయినా. ..ఎమోషనల్ నీడ్స్ మనిషి కి fulfil కాకపోతే. ...మనిషి కొద్ది కొద్ది గా. ..కుచించుకుపోడా. ..?జీవం ఉంటుందా. .?కోల్పోడా. .!ప్రేమ. అభిమానం. Caring దయ కరుణ లాంటి నీడ్స్ అవసరం లేదా. .మనిషిషికి ఇవి ప్రకృతి పరమైనవా. .?తెలివి లేకనా. .?ఎమోషనల్ నీడ్స్ ఎగ్జిస్టింషియల్ నీడ్స్ లోకి రావా. .?ఇన్నర్ గా. ..!?nice talk 🎉
When one's mind is stilled, there will be no emotions & feeling because one will realise the mind game, as Bhagawan rightly said mind is an exaggerated force of atma
బుద్ధుడు అంటే అందరికీ సాధారణంగా గుర్తుకు వచ్చేది అహింస.. ఐతే, అతని బోధనల సారమంతా అదేననీ అంతకు మించి ఏమీ లేదనీ అనుకుంటుంటారు.. అతని బోధనలు అలా పరిమితం కాదనీ ఎంతో విస్తృతమనీ చాలమందికి తెలియదు. సమాజం లో అందరికి స్వేచ్ఛా ఉండాలి మతాల నుండి మనిషికి విముక్తి కావాలి దేవుడు కేంద్రంగా ఉండే మతం తప్పు. మోక్షం కేంద్రంగా ఉండే మతం తప్పు. జంతుబలి ఇవ్వటం కేంద్రంగా ఉండే మతం తప్పు. నిజమైన మతం మనిషి హృదయంలో వికశిస్తుంది కానీ మతగ్రంథాలలో కాదు. మనిషి మరియు నైతికత కేంద్రంగా ఉండేదే ఆచరించదగిన మతం. అలా కానిది కేవలం క్రూరమయిన మూఢనమ్మకం. నైతికత అనేది జీవితానికి కేవలం ఒక ఆదర్శంగా ఉంటే సరిపోదు. దైవం అనేది లేదు కనుక, నైతికతే మానవజీవితాన్ని నిర్దేశించే నియమంగా ఉండాలి. మతం యొక్క విధి సమాజాన్ని సంఘటితంగా మరియు సంతోషంగా ఉండేలా చేయటమే గానీ, ప్రపంచపు మూలాన్నో లేక అంతాన్నో ఊహించటం కాదు. వివిధ ప్రయోజనాల సంఘర్షణ వలన ప్రపంచంలో దుఃఖం కలుగుతుంది, దానిని పరిష్కరించడానికి ఏకైక మార్గం అష్టాంగ మార్గాన్ని అనుసరించడం. వనరులపై కొన్ని వర్గాల ఆధిపత్యం, ఆ వర్గాలకు అధికారాన్ని తెస్తే, అవి లేని వర్గాలకు దుఃఖం కలిగిస్తుంది. ఈ దుఃఖ కారణాలను తొలగించటం సమాజ శ్రేయస్సు కోసం అత్యవసరం. మనుషులందరూ సమానమే. జన్మ కాదు .. విలువలే మనిషి యొక్క కొలమానం. ముఖ్యమైనది ఉన్నతమైన ఆదర్శాలే కానీ జన్మ కాదు. మైత్రి లేదా అందరితో సహవాసం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు, అది శత్రువైనా సరే. ప్రతి ఒక్కరికి నేర్చుకునే హక్కు ఉంది. మనిషి జీవించటానికి తిండి ఎంత అవసరమో, నేర్చుకోవడం కూడా అంతే అవసరం. సచ్చరిత్ర లేని నేర్పు ప్రమాదకరం. ప్రతి ఒక్కటి విచారణ మరియు పరీక్షకు లోబడి ఉంటుంది. ఏదీ పరమ సత్యమో మిత్య సత్యమో కాదు. ఏదీ ఫైనల్ కాదు. ప్రతిదీ కార్య కారణ సంబంధాలకు లోబడే ఉంటుంది. ఏదీ శాశ్వతమైనది లేదా సనాతనమైనది కాదు. ప్రతి విషయం మార్పుకు లోబడి ఉంటుంది. ఉంది అంటే మార్పు ఉందనే. యుద్ధం నిజం మరియు న్యాయం కోసమే తప్ప ఆధిపత్యం కోసమో పగ కోసమో కాదు. యుద్ధం లో గెలిచిన వారికి ఓడిపోయిన వారి పట్ల బాధ్యతలు ఉంటాయి. ఆయన బోధనలు ఎంత విశాలమైనవి, ఎంత లోతైనవి