ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన బీసీల జనగణన ను వెంటనే చేపట్టాలని, ఈయొక్క జనగణన జరిగిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చేస్తున్న బీసీల ఆమరణ నిరాహార దీక్ష కు గంగపుత్రులు మద్దతు తెలియజేసారు.
"బీసీల అమరణ దీక్ష"
ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం "సంచార ఆమరణ దీక్ష" గా మార్చినప్పటికి కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం అధికారిక ప్రకటన వెలుపడే వరకు దీక్ష కొనసాగుతుంది అని దీక్షలో ఉన్న నాయకులు అన్నారు.
గంగపుత్ర చైతన్య సమితి అధ్యక్షులు మరియు బిసి కులాల రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు మంగలి పల్లి శంకర్ గంగపుత్ర గారు గాంధీ ఆస్పత్రి లో దీక్ష చేస్తున్న బత్తుల సిద్దేశ్వర్ పటేల్ గారిని పరామర్శించి, తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. అదే విధంగా "ప్రభుత్వం ఈయొక్క కుల జనగణన వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈయొక్క కార్యక్రమంలో కైరంకొండ నర్సింగ్ గంగపుత్ర, పూస సత్యనారాయణ గంగపుత్ర, హైదరాబాద్ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీమతి కొప్పు పద్మ గంగపుత్ర గారు మరియు వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర, జాతీయ నాయకులు మద్దతు తెలిపారు.
#cmo #yuvagalam #bc #revanthreddy #teenmarmallanna #ponnamprabhakar #trending #trendingvideo #gangaputra
21 сен 2024