Тёмный

సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తా మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ మతిన్ 

ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్
Просмотров 611
50% 1

తంజీముల్ మజీద్ కమిటీ చైర్మన్ గా సయ్యద్ మతిన్ ఘన విజయం
స్థానిక ఎన్నికలు తలదన్నే రీతిలో అభ్యర్థుల విస్తృత
ప్రచారం
సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తా
ప్రతిష్టాత్మకంగా జరిగిన గజ్వేల్ పట్టణ తంజీముల్ మజీద్ కమిటీ ఎన్నికల్లో సయ్యద్ మతీన్ ఘనవిజయం సాధించారు. గత వారం రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికలను తనదన్నే రీతిలో అభ్యర్థులు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కాగా ఆదివారం పట్టణ పాత మజీద్ వద్ద పోలింగ్ నిర్వహించగా, మజీద్ కమిటీ అధ్యక్షునిగా సయ్యద్ మతిన్ 1143 ఓట్లు సాధించి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సయ్యద్ మతిన్ , హైదర్ ఎక్బాల్ లు పోటీ పడ్డారు. మొత్తం 1203 ఓట్లకు గాను, సయ్యద్ మతిన్ ఆటో గుర్తుకు 1143 ఓట్లు పడ్డాయి. సమీప ప్రత్యర్థి హైదర్ ఎగ్బాల్ కు 54 ఓట్లు రాగా, 6 ఓట్లు చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. కాగా మజీద్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన సయ్యద్ మతిన్ మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ మైనారిటీ ముస్లింల సంక్షేమానికి కృషి చేయనుండగా, వివిధ మజీద్ లలో అసంపూర్తి పనులను పూర్తి చేస్తానని, అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి సహకారంతో పేద ముస్లిం సోదరుల ఆర్థికకాభివృద్ధికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయనను మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మజీద్ కమిటీ మాజీ చైర్మన్లు సాజిద్ బేగ్, సయ్యద్ యూసుపొద్దీన్, జాఫర్ ఖాన్, నాయకులు జహీర్, రియాజ్, గౌసుద్దీన్, సమీర్, సర్దార్ ఖాన్, ఆరిఫ్, వజీర్ ఖాన్, శివారెడ్డి, రాములు గౌడ్, సందీప్ రెడ్డి, మోహన్ తదితరులు ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее