దేవుడి దర్శనానికి వెళ్లిన భక్తులు వెతికినా కనబడలేదు అంటే భక్తుడిగా కనబడలేదు కానీ దేవుడి గా కనబడడం. భక్తుడు కాళీ అయి దేవుడు చేరడం. దేవుడి అనుగ్రహం తో ఎవరైతే నిజ రూపదర్శనము అంటే "నా రూపము నేను" "నా నామము నేను"అని చూసిన భక్తుడు ఆ క్షణము నుండి భక్తుడు స్థానంలో దేవుడే శేషిస్తాడు. ఇక భక్తుడు కాళీ అయి అంతా దేవుడే అని దేవుడిగా చలామణి అవుతాడు. కాశీ విశ్వనాథుడు దర్శనము అయిన తర్వాత విశ్వేశ్వరుడు గా తిరిగి రావడంతో మళ్ళీ మళ్ళీ చూడడానికి వెళ్లాల్సిన పని లేదు.అయిన మళ్ళీ వెళ్తున్నాము అంటే విశ్వనాథుడు గా తిరిగి రావట్లేదు అని ఆర్థము.
ఎన్ని చెప్పిన ఆ సమయం వచ్చు వరకు ఈ భ్రమ తొలగదు . ఈ భ్రమ తొలిగితే గాని ఆ సమయం రాదు. అప్పటి వరకు ప్రయత్నం తప్పదు. ప్రయత్నం లేక పోయిన పరవాలేదు! ట్రైన్ లో ఎంత నడచిన ఆ స్టాప్ వచ్చు వరకు వెయిట్ చెయ్య వలసిందే! నడవక పోయిన వెయిట్ చెయ్య వలసిందే! స్టాప్ వస్తే నిద్ర పోతున్నా లేవవలసిందే!
దేవుడుకి తాను దేవుడనేదే తెలియదు. భక్తుడు సద్వస్తువు కు పెట్టుకున్న పేరు. దేవుడుకి భక్తుడు కూడా నేనే అని తెలుసు. భక్తుడు దేవుడు కూడా నేనే అని అంగీకరించకపోవడం తో సమస్య. ఒప్పుకుంటే తప్పులుచేయాయకుండా ఉండలేడు కాబట్టి అసలే ఒప్పుకొడు. దేవుడుంటే భక్తుడు ఉండడు. భక్తుడుంటే దేవుడు భక్తుడి రూపంలో కూడా ఉంటాడు. గుడికి వెళ్తే దేవుడు కూర్చున్నా, నిలబడిన్నా,కదలకుండా, మెదలకుండా, నిస్చేస్టుడి గా ఉంటాడు అంటే భక్తడి గాడానిద్రా అనుభవస్థితి అని గుర్తిస్తే, భక్తుడే గాఢ నిద్ర (మెలుకువ)లో దేవుడిగా దేవుడై ఉన్నాడు. కల లోకి జారిన భక్తుడు తన రూపంలోకూడా దేవుడే ఉన్నాడని గుర్తిస్తే భక్తుడు అనే వాడు ఉండడు కాకా వుండడు. ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్కడే "నేను - ఆకాశము - ఒకటి - ఆత్మ - గురువు - ఈశ్వరుడు - అంతా - అవకాశానికే అవకాశము -స్ఫురణ - అహం అహం - స్వరూపము" అని చెప్పేది.