చిలకలూరిపేట లో ప్రసిద్ధి చెందిన ఆహారశాలలు గురించి కార్యక్రమాల చిత్రీకరణ జరపాలని అనుకున్నదే తడువుగా స్థానిక మన వీక్షక మిత్రులను సంప్రదించగా వారు ఇచ్చిన సమాచారం మేరకు పలు కార్యక్రమాలు ఇటీవల చిత్రీకరణ జరిపాను. పేటలోని గడియార స్థంభం సమీపంలో ఉన్న సత్యం గారి ఆహార శాల గూర్చి ప్రసారంతో నేను ఈ వేళ మీ ముందుకు వచ్చాను చిలకలూరిపేట రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్వాగతం.నమస్కారం నాపేరు లోక్ నాధ్.ఈ ఆహార శాల నిర్వాహకులు వెంకటేశ్వర్లు గారు తమ పెద్దలు చూపిన మార్గదర్శితతో ఆహార తయారీలో నైపుణ్య అనుభవం పొంది కమ్మటి ఆహారం వడ్డిస్తూ ఈ పట్టణంలో గుర్తింపు సంపాదించుకున్నారు.మనోగతంలో ఎల్లప్పుడూ ఆహారం పట్ల ఉన్న గౌరవం నేను మిక్కిలిగా వ్యక్తం చేయి సందర్భం భోజన శాలలకు వెళ్ళినప్పుడు.ఏ విధమైన తార తమ్యాలు లేవు,ఎవరికి ఎవరో తెలియదు కాని వేళకు దేహం కలిగించిన ఆకలి మాత్రం అందరికి ఒక్కటే.బొజ్జకు గుప్పెడు బువ్వను అందిస్తూ తోటి వారితో తింటూఉంటే జీవిత పరమార్ధం మరింతగా అవగతం అవుతుంది.భోజనం ధర 100రూపాయిలు పొడులు, కూరలు,పచ్చడులు ఇతరాలన్ని కలిపి 15వరకు పదార్థాలు అందుబాటులో ఉంటాయి.శుభ్రత రుచే కాదు తేలికగా అరుగుదల అయ్యేలా సాత్విక స్వభావం కలిగి ఉంది ఇక్కడ ఆహారం. కడుపునిండాగా తినేలా ఆత్మీయ వడ్డింపు ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం.ఈ దృశ్యానుభూతి మీకు పదార్థాల గుణ ఘనం తెలపవచ్చు.తింటూ భోజన అనుభూతి మీతో పంచుకుంటాను.
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
8 сен 2024