ఈ ప్రవచనాన్ని ఆడియో రూపంలో ఇక్కడనుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. drive.google.com/open?id=0B1ewfvakSq2UVmlFZjFVSFZTaVU మిగిలినవి: drive.google.com/open?id=0B1ewfvakSq2UUlpYS202T3Y4dG8
మన సంస్కృతి 500 సంవత్సరాలు అష్టకష్టాలు, అవమానాల పాలైయింది, దోపిడీకి గురైంది, స్త్రీలను ఎత్తుకుపోయారు. దీని పరంగా కూడా మనం ఏదైనా ఆలోచించవలసినదే, ఇంత కష్టాలు పడిన ఈ దేశానికి నేను ఏమైనా చెయ్యాలి కదా? దీనికి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులో శతృ భావన నశించాలి అనుకుంటే మంచిది కానీ, "శత్రువు నశించడం" అనే క్రోధం వల్ల మనకే నష్టం. శతృవు కాదు శతృవులో వున్న శతృత్వం నశించాలి అని ఈశ్వరుని వేడుకోవాలి, దానివల్ల సత్వ గుణం మనలో స్థిరంగా ఉంటుంది. దేశం కోసం యుద్ధం చేస్తే దాన్ని ధర్మ పరాక్రమం అంటారు, క్రోధం కాదు అక్కడ అది కర్తవ్యం . కృష్ణుడు అర్జునుడు చేత యుద్ధం చేయించడం అంతా కూడా ధర్మ పరాక్రమం బోధించాడు కానీ శతృత్వం బోధించలేదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ వీళ్ళు నీ శత్రువులు వాళ్ళను చంపి నువ్వు ఆనందపడు అని అలాగా ఎక్కడ చెప్పనేలేదు. ధర్మ పరాక్రమాన్ని బోధించాడు. ధర్మ పరాక్రమంలో ఎక్కడ ద్వేషం లేదు, క్రూరత్వం లేదు. ఈ రెండూ లేకుండా ఎక్కడైతే ఉంటుందో అది ధర్మ పరాక్రమం. అర్జునుడికి ధర్మ పరాక్రమం బోధించాడు, శ్రీ కృష్ణుడు. సద్గురు శ్రీ శివానంద మూర్తిగారు
GURUBHYONAMAH,How legal problem created by exCMs and his party with so many Somersaults destroyed my progress in life keeping my family to troubles with power in hand ,Judiciary manipulated by certain sect ,am I responsible to hold ? GURUBHYONAMAH GURUBHYONAMAH GURUBHYONAMAH