వాతావరణం, సాగు పద్ధతుల్లో వచ్చిన మార్పులు... జీవనశైలి, ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. రసాయనాలతో పండిన పంటలు... ఆయు క్షీణం చేస్తున్నాయి. తిండి తిన్నా కండ పుష్టిలేని పంటలు... రకరకాల రోగాలకి కారణమవుతున్న నేటి పరిస్థితుల్లో... సంప్రదాయ పంటలకి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వనరులతో పండే చిరు ధాన్యాల పంటలకి ఆదరణ పెరుగుతోంది. ఈ పోషక ధాన్యాల ఆహారం తీసుకుంటే కలిగే ప్రయోజనాలపై శాస్త్రవేత్తలు కల్పిస్తున్న అవగాహనతో... ప్రజలు పాత పంటల వంటలపై ఆసక్తి చూపుతున్నారు. రైతులు కూడా రాగులు, కొర్రలు సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. సిరుల ధాన్యాల సాగు, పరిశోధనల్లో ముందున్న విజయనగరం పరిశోధన స్థానం... కొనుగోలు దారులు అధికంగా కోరుకుంటున్న అండుకొర్రల సాగుని ప్రయోగాత్మకంగా చేపట్టింది.
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our RU-vid Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------
24 сен 2018