మైదుకూరు ప్రాంతంలో ప్రజాదరణ పొందిన శాల జి.వి సత్రంలో వీరయ్య గారు మూడు దశాబ్దాలుగా నిర్వహణ చేస్తున్న ఈ ఆహార శాల.ఉపాధి కల్పన లో శాలను ప్రారంభించి తక్కువ ధరకు ఆహారం వడ్డిస్తూ ఇక్కడ గుర్తింపు పొందారు వారు.
ఇక్కడ ఆహార జాబితాలో ఉన్న పులగం నాకు చాలా బాగా నచ్చింది.ప్రత్యేకత వారు అందించు నెయ్యి. పులగానికి శనక్కాయల పచ్చడి,నెయ్యి మిళితం చేసి తినగా దండిగా లభించింది కమ్మని రుచి .
తృప్తికరంగా ఉంది కోడి కూర.ముక్క మరీ మెత్తగా కాకుండా కాసేపు నములుకునేందుకు అనువుగా వండారు.ఘాటుకు తావు లేదు. పరిమితంగా ఉంది కారం.
ముందుగా వివిధ మసాలా దినుసులతో కారం,పులుపులకు ప్రాముఖ్యతనిచ్చి పులుసు సిద్ధం చేసుకున్నాక
మేలైన చేపలను పెద్ద ముక్కలుగా చేసి కొరవడ కుండా సాంతం పులుసు సమకూర్చి సిద్ధం చేసిన వంటకం అంతిమంగా గుత్తంగా సిద్ధమైంది.రుచి చూడగా ముక్క మృదువుగా తగలగా తర్వాత నోటి అంతటా సంతరించినది రవ్వంత కారంతో జతపడిన పులుపుదన పరవశ రుచి.
తగుకొలది ఎసరు పోయడం వలన కూరతో కలుపుతున్నప్పుడు చేతికి సౌకర్యంగాను తినగా నోటికి సౌలభ్యంగా ఉంది సంగటి. వారు స్వయంగా మరిపట్టించుకున్న రాగులు ద్వారా వచ్చిన పండిని సంగటికి వినియోగించినందువల్ల నాణ్యతతో ఉంది ఆహారం.
కోడి కూర, చేపల కూర తో రాగి సంగటి కలుపుకుని తినగా పొందిన రుచి గురించి కార్యక్రమ పరంపరలో వీక్షించగలరు.
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
12 ноя 2022