విద్యా ప్రకాశానందగిరి స్వామి (ఏప్రిల్ 13, 1914 - ఏప్రిల్ 10, 1998) ఒక ఆధ్యాత్మికవేత్త. శ్రీకాళహస్తి లోని శ్రీ శుకబ్రహ్మాశ్రమం స్థాపకుడు, బహుభాషా కోవిదుడు, గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరి వ్యవస్థాపకులు. మలయాళ స్వామి శిష్యుల్లో ముఖ్యమైన వారు. ఆయన జన్మనామం ఆనందమోహనుడు. బందరులో జన్మించిన అతను అక్కడే బి. ఎ. దాకా అక్కడే చదువుకున్నారు. హిందీలో నైపుణ్యం కోసం కాశీకి వెళ్ళి వచ్చారు. తర్వాత తండ్రి కోరిక మేరకు మలయాళ స్వామి చెంతకు చేరి అక్కడే ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందారు. 1950 లో శ్రీకాళహస్తిలో శ్రీ శుకబ్రహ్మాశ్రమం ఏర్పాటు చేసి ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో పలు ప్రాంతాల్లో గీతాజ్ఞాన యజ్ఞాలు నిర్వహించారు. ఉపన్యాసాలు ఇచ్చారు. పలు పుస్తకాలు రచించారు. భగవద్గీతపై అతను రచించిన విపులమైన వ్యాఖ్యాన గ్రంథం గీతామకరందం చాలా ప్రాచుర్యం పొందిన గ్రంథం.వ్యాసాశ్రమంలో ఉన్నపుడు యథార్థ భారతి, శుకబ్రహ్మాశ్రమం తరపున వేదాంతభేరి పత్రికలను ప్రచురించడం ప్రారంభించారు. పలు పత్రికల్లో అతను రాసిన పరమార్థ కథలు ప్రచురితమయ్యాయి.
జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻