మహనీయులు శ్రీ ఉషశ్రీ గారు రామాయణం చెబుతోంటే ఎలా అనిపించేదంటే నిజంగా ఆ రాముడు ఆ సీతాదేవి మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉండేవారు. ఆయన ప్రవచనం వింటే నాస్తీకులు సైతం ఆస్తీకులుగా మారేంత ప్రభావ వంతంగా ఉండేది.
శ్రీ రాముల వారు వనవాసానికి వెళ్ళే సమయంలో సీతా అమ్మవారు రాముల వారితో మాట్లాడిన తీరు కొంత ఆశ్చర్యం గొలిపేట్లుగా ఉంది. వాస్తవానికి ఆమాటలు వాల్మీకి రామాయణం లో ఉన్నాయా? మగ వాడి రూపంలో ఉన్న ఆడ మనిషివి అనే మాటలు జీర్నించు కొలేనివిగా ఉన్నాయి. ఒకసారి పరిశీలించాలి అని విజ్ఞప్తి.