నా జన్మకు కారణమై, ఈ నా జీవితానికి పరమార్ధం తెలియజేసి, నన్ను ఇంతటివాడిని ఓ.. నా.. తండ్రీ... నువ్వు స్వర్గలోక ప్రయాణం చేస్తున్నప్పుడు నీవు అలసిపోయినప్పుడు, నీకు దాహం వేసినప్పుడు నీకోసం ఈ జలోదకాన్ని తర్పణంగా నీళ్ళు విడిచిపెడుతున్నాను..., దయచేసి ఈ నీళ్ళు తాగి, నీ దాహం తీర్చుకుని, మమ్మల్ని కృతార్ధులను చేయవలసిందిగా మనస్పూర్తిగా ప్రార్ధన చేసుకుంటున్నాను తండ్రీ...! ధన్యవాదములు...!
గరికిపాటి నరసింహ రావు గురువుగారు మీరు ప్రవచనాలు మొదలు పెట్టినప్పటి నుండి జనులలో ఎంతో మార్పు వచ్చింది మూఢనమ్మకాలతో మునిగిపోయిన జనంలో మీరు ఎంతో చైతన్యం తెచ్చారు ఉన్నది ఉన్నట్లుగా మూఢనమ్మకాలు కి పనికిరాని వ్యవహారాలకి తావు ఇవ్వకుండా నిరంతరం జనులను చైతన్యపరిచే విధంగా మీ గొప్ప విచారణ ఉంటుంది మీరు నిండు నూరేళ్లు ప్రవచనాలు చెప్తూనే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను
పూజ్యులైన బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి అద్భుతమైన వివరణ చాల గొప్పవి.వారు ఉన్నప్పుడు మేము బ్రతికి ఉండడం గొప్ప భగవద్ వరము.ఎంతటి మేధస్సు,వారి విశ్లేషణ అమోఘము.వారికి సరి సమానమైన వాళ్ళు లేరు.ఒకవైపు మూఢనమ్మకాలను,దూరము చేస్తూ,ప్రామాణిక దృష్టాంతాలతో విశ్లేషణ చేసే తీరు వర్ణనాతీతము. మహానుభావా మీకు శతధా, సహస్రధా వందనములు.
గురువు గారికి పాడాభివందనాలు.. మీరు తెలియని వాళ్లకు కళ్ళకు కట్టినట్లు వివరించారు.. నేను ఈ మధ్య మా తండ్రి గారికి మాబ్రహ్మ గారు చెప్పినట్లు చేసాను (అంతా మీరు చెప్పినది )వాస్తవము... 10 రోజులు శాస్తరోక్తంగా చేసాను.. ధన్యవాదములు గురువుగారు 🌹🙏🙏
అవును అండి మా అమ్మ గారికి నిత్య కర్మ చేశాను నేను. మీరు అన్నట్లు కాలువ ప్రక్కన కూర్చొని చేసే సమయంలో చాలా సార్లు స్నానం చేసాను. కానీ నాకు ఎట్టి అనారోగ్యం చేయలేదు.
చాలా చక్కగా వివరణ ఇచ్చారు నమస్కారం నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏 ఓం నమః శివాయ ఓం నమః శివాయ🙏🙏 ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
సూర్యాస్తమయం కంటే ముందు చనిపోతే సూర్యాస్తమయం లోపే దహన కార్యక్రమాలకు ఏర్పాటు చేయగలిగితే మంచిది. ఏ రాత్రిపూట చనిపోతే గనక సూర్యోదయం అయిన తర్వాత మళ్లీ సూర్యాస్తమయం లోపు గనుక దహన కార్యక్రమాన్ని జరిపిస్తే మంచిది. ఒక రోజు గడిస్తే ఆ శవాన్ని పాచి శవం అంటారు. సంస్కృతంలో దాన్నే పర్యుషితము అంటారు. నిర్జీవమైన పాంచ భౌతిక శరీరము అయినా సరే అగ్నిహోత్రానికి అర్పిస్తున్నాం కాబట్టి దానికి పర్యుషిత దోషము ఏర్పడకూడదు. ఏరోజు చనిపోతే ఆ రోజే దహనము చేయాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత చనిపోయిన వారికి మాత్రమే ఆ రాత్రి పూట దహన కార్యక్రమం ఉండదు. లేదా సూర్యాస్తమయానికి కొద్ది సమయం ముందు ప్రాణం పోయినా కూడా ఆ రాత్రిపూట దహన కార్యక్రమం ఉండదు. కొడుకు అమెరికా నుంచి రావాల్సిన వాడైనా సరే, ఇక్కడ వాళ్లు అతడిని గనక ఒరేయ్ అక్కడినుంచి నువ్వు ఏం వస్తావు లే గాని ఇక్కడ కార్యక్రమం మేము జరిపిస్తాం నువ్వు రాకున్నా పర్వాలేదు అని అన్నారనుకోండి వాడు సంతోషంగా హమ్మయ్య నాకు చాలా పెద్ద బరువు తగ్గింది అనుకుంటాడు కానీ అయ్యో వెళ్ళలేక పోతున్నానే అని ఏం బాధ పడడు. ఖర్చులూ మిగులుతాయి, ఉన్నఫళంగా ప్రయాణం చేయాల్సిన కష్టం తప్పుతుంది. వ్యయప్రయాసలు ఉండవు. తను ఇప్పుడు బయలుదేరి వెళ్లిన చనిపోయిన వాడిని బతికి రాడు ఆ కట్టిన తీసుకెళ్లి నిప్పుల్లో కాల్చవలసిందే కదా, కాబట్టి వెళ్లడం అనేది గనుక తప్పితే ఎంత బాగుండు అని ఆలోచిస్తాడు కావాలంటే ఎవరైనా ఇలాంటి సందర్భం వస్తే ఇట్లాగే మాట్లాడి చూడండి విషయం మీకు తేటతెతెల్లమైపోతుంది. తల్లిదండ్రుల మీద భక్తు ఉన్నవాడు ప్రేమ ఉన్నవాడు దేశం మీద భక్తి ఉన్నవాడు సాంప్రదాయాలు ఆచారాలను గౌరవించేవాడు అసలు దేశం వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్తాడా ఏ ఆ బ్రతికేది ఏదో ఈ దేశంలో ఇక్కడ బతకలేడా, కాబట్టి అవేవీ లేని వాడే కాబట్టి వాడురావలసిన పనిలేదు. వాడికొరకు శవదహనం ఆపవలసినపని అంతకంటేలేదు
🌹🙏 స్వామి గారు మీకు సహస్ర కోటి పాదాభివందనములు అబ్బా అబ్బా నా జన్మ ధన్యమైపోతుందండి ఇంత క్షుణ్ణంగా కళ్ళకు కట్టినట్టు చెవులకు అద్దినట్టు మనసుకి హత్తుకున్నట్టు అబ్బ ఏం చెప్పా రండి, ఇటువంటి మేధావిని మాకు జాతికి బహుమానంగా ఇచ్చిన మీ తల్లిదండ్రులకు మా వందనాలు, స్వామి మీ కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు మీ మాటలు మీ ప్రవచనాలుమాకు కావాలి దయచేసి మీరు ఆపవద్దు ç
గరికిపాటి గారికి నా మనస్ఫూర్తి పాదాభివందనాలు పెద్ద కొడుకా నేనే కర్మ చేశాను మా అమ్మగారికి కూడా నేనే కర్మ చేశాను సంవత్సరికలైపోయినాయి నేను కాశీ ఎప్పుడు వెళ్లాలో అర్థం కావట్లేదు
బంధువులు మరణించిన సమయంలో కూతురు లేదా కుమారుడి పెండ్లి చేసిన వారిని మరణించిన వ్యక్తి శ్మశానం లో దహనం చేసే సమయంలో చూడవద్దు అని, శ్మశానం నుంచి వచ్చి ఇంట్లో పెట్టే దీపం చూడవద్దు అని పెద్దలు చెబుతారు. అయితే ఇలాంటి సమస్యలకు గురువు గారు పరిష్కారం చూపించ గలరని కోరుకుంటున్నాము.
పవిత్ర, ప్రశాంత జీవనమా లేక పాపిష్టి జీవనమా.! దైవభక్తి సంగతి దేవుడెరుగు..పాప భీతి కూడా పూర్తిగా ప్రజల్లో నశించి పోతుంది.! నేటి సమాజంలో నీతి,నిజాయితీ,నైతికత,ధార్మికత వంటి సుగుణాలన్నీ అడుగంటి పోతున్నాయి.! నేటి ఆధునిక తరంలో హేతువాద, నాస్తికవాద ధోరణులు పెడత్రోవ పట్టి...ప్రజల్లో దైవ భక్తి,దేశ భక్తి,దర్మానురక్తి పూర్తిగా పతనమై పోతున్నాయి.! ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో పాపభీతిని పెంచితే తప్ప సమాజం బాగుపడదు.! అందుకు..ప్రతిరోజూ తప్పక గరుడ పురాణం పారాయణం చేయడం తప్ప తరుణోపాయం మరొకటి లేదు. గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి.! ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది.గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.! ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా... మానవుడు చేసే వివిధములైన పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం,పుణ్యము సంపాదించు కోవడానికి వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది. గరిక పాటి నరసింహారావు గారి గరుడ పురాణము ప్రవచనం విందాం.. పునీతులమవుదాం.!
అయ్యా మీ వంటి వాళ్ళు పరిష్కారం చెప్పాలి.ప్రజలు నగరాల లో చాలా అవస్థలు పడుతున్నారు. ఉదా. మా పెద తాత గారి మనమడి భార్య పోయింది.వాళ్ళు ఏదో వూర్లో వుంటారు, మేము, హైదరాబాద్ లో వుంటున్నాం, మా అబ్బాయి కోడలు పిల్లలు బెంగుళూరు లో,మరొకరు అమెరికా లో వున్నారు. వీళ్ళెవరికీ ఆ పోయిన ఆవిడ తెలవదు, మా ఆవిడ కి కూడా తెలవదు, ఎప్పుడూ చూడ లేదు. మా అందరికీ పది రోజులు. ఆ పోయినా ఆవిడ తోడ బుట్టిన అన్న తమ్ముళ్లు,అక్క చెల్లెళ్ళు, ఆడ సంతానం, వాళ్ళు అంతా అదే ప్రాంతం లో వుంటున్నారు, వాళ్ళకి మూడు రోజులే .. తర్వాత మరో సందేహం, మా నాన్న గారికి మొదట ఒక వివాహం అయ్యింది,ఆ రోజుల్లో చిన్న పిల్లల అప్పుడే, ఆ కాపురానికి రాక మునుపే పోయింది.మా నాన్న గారు శ్రాద్ధ విధి పెట్టే వారు, ఆయన పోయి యిరవై ఏళ్లు అయ్యింది, ఆవిడ డెబ్భై ఏళ్ళ క్రితం ఎపుడో పోయింది, మాకు కానీ,మా అమ్మ గారికి కానీ ఎవరికీ ఆవిడ అసలు తెలవదు. ఆవిడకి మేము శ్రాద్ధ విధి చేయాలా? మరొక సందేహం. మా నాన్న గారికి వారి తల్లి గారు చిన్న తనం ఆరవ యేట పోయారు.ఆయన వున్నంత కాలం శ్రాద్ధ విధి చేశారు. మాకు మా తల్లి గారు వున్నారు, కాబట్టి ఆవిడ కి మేము చేయటం లేదు.మాతృ వర్గం లో రారు. మరలా మా తల్లి గారు పోతే అప్పుడు వర్గ త్రయం లోకి 70-80 ఏళ్ళ తర్వాత వస్తారు. అప్పటి వరకూ వారు ఎక్కడ వున్నట్లు, మా నాన్న గారి నాయనమ్మ కూడా త్రయం లోకి వస్తారు, అసలు ఆవిడ పేరు కూడా మాకు తెలవదు. వర్గ త్రయం లో తల్లి గారికి, 70 ఏళ్ళ క్రితం ఎపుడో పోయినా మాకు తెలవాని సవతి తల్లికి, మా నాన్న గారికి కూడా తెలవానీ వారి తల్లి గారికి చెప్పాలి. కదా. ఇంతకాలం వారు ఎక్కడ వున్నట్లు?
When ever I attend cremation I with my friends wait till KAPALA moksham we return only after hearing the cracking sound It is what. We are practicing 🙏🙏🙏🙏🙏
Chala bagundi mii speech mii mathamlo muda aacharalu katte science miru cheppindi bagundi naku nachhindi.nenu Christian but anni mathalaloni manchi vishayalu telusukovataniki estapadanu
Sir me pravachanalu vintu unta chala baguntay potuloori veera bramhendra swamula vari gurinchi konni asaktikaramyna vishayalu gurinchi cheppagalaru. Sir