నమస్కారం స్వామి.తనది కాని పని తాను మీద వేసుకుని చేసేవాడు జీవాత్మగా శరీరంలో ఉన్న మనమే.చేసేది వేరొకరు అని తెలియక నేను అనే అహంతో ప్రారబ్ద కర్మానుసారంగా పనులు చేస్తూ ఆ పనుల్లో ఉన్న పాప పుణ్యాల కర్మల్ని సంపాదించుకొని ఇప్పటికే అనుభవించవలసిన కర్మల్ని పేర పేట్టుకొని కొత్త కర్మల్ని కూడా అంటించుకుని వాటిని అనుభవించేందుకు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ చస్తూ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటున్న జీవాత్మలైన మన కోసం చెప్పిందే భగవద్గీతా జ్ఞానం.పనులు చేస్తున్నది నువ్వు కాదు,నీ ప్రారబ్ద కర్మానుసారంగా పనులు చేస్తూ నీతో అనుభవింప చేస్తున్నారు ఆత్మ అని ఈ కర్మల్ని ఏ విధంగా నాశనం చేసుకొని కర్మరాహిత్యంతో జన్మరాహిత్యం పొందాలో మహాద్భుతమైన గ్రంథం భగవద్గీత.తను చేయని హత్య నేనే చేశానని శిక్ష అనుభవిస్తున్నట్లు జీవాత్మ కర్మల ధనాన్ని సంపాదించుకొంటూ ప్రతీ జన్మలోనూ కొన్నింటిని అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మల్ని కర్మల ఎక్కౌంట్లో జమ చేసుకుంటూ ఉన్నాడు