@@ganeshraj143 ప్రేతాత్మలు అని అందరూ చెపుతున్నారు కదా అందుకే నేను కూడా ఆ పదం వాడవలసి వచ్చింది కానీ నాకు కూడా అర్థం తెలియదు.అందుకే అడిగాను.ఇంకొక సందేహం కూడా ఉంది.జీవించ వలసిన కాలం అంతా జీవించి వృద్ధాప్యంలో సహజ మరణం పొందిన వారి గురించి భగవద్గీతలో సాంఖ్యా యోగం 22 వ శ్లోకంలో ఇలా చెప్పారు.జీర్ణం అయిన వస్త్రం అంటే చినిగిపోయిన వస్త్రం తీసి వేసి కొత్త వస్త్రం ధరిస్తున్నట్టు జీవుడు పాడైపోయి నివసించేందుకు వీలు లేని శరీరాన్ని వదిలి వేరొక శరీరంలో చేరుకున్నాడు అని చెప్పారు కదా?మరి ఈ శ్రాద్ధ కర్మలు వాళ్ళకి అందే అవకాశం లేదు కదా? అటువంటప్పుడు ఈ పనులు అవసరమా అని నా సందేహం