కార్పోరేట్ సంస్థల కొలువులు కాదనుకొని కలెక్టర్ కావడమే లక్ష్యంగా కష్టపడుతున్నాడు.... గ్రూప్-2 పరీక్షల్లో 2వ ర్యాంకర్ తిరుపతి కుర్రాడు ప్రేమ్సాయి శ్రీనివాస్....
చెక్కు చెదరని సంకల్పం ఆ యువకుడి సొంతం. బీటెక్ చేసి ప్రముఖ కార్పోరేట్ సంస్థల నుంచి ఉద్యోగ అవకాశాలు వచ్చిన పట్టించుకోలేదు. కలెక్టర్ కావాలన్న చిన్నప్పటి కలను నేరవేర్చుకునేందుకు నిరంతరం శ్రమించాడు. పుస్తకాలతోనే గంటలు కొద్దీ గడిపాడు. ఇటీవల APPSC నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకును సాధించి సత్తా చాటాడు ప్రేమ్సాయి శ్రీనివాస్. UPSC నిర్వహించే సివిల్స్ పరీక్షల్లోనూ సత్తా చాటి కలెక్టర్ అవ్వటమే తన లక్ష్యమంటున్న తిరుపతి యువకుడిపై ప్రత్యేక కథనం.
#YuvaEtv
#EtvAndhraPradesh
#EtvTelangana
15 сен 2024