తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున ఒక కిలోమీటరు దూరంలో చక్రతీర్థం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఉంది. ఈ శిలాతోరణం జాతీయ స్మారక చిహ్నం. ఇది ఎగువ ప్రోటెరోజోయిక్ (160-57 కోట్ల సంవత్సరాల క్రితం నాటి) కాలానికి చెందిన కడప క్వార్ట్జైటు రాళ్ళలో ఏర్పడింది. ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడింది
5 окт 2024