గతేడాది... హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యారు.. అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్. ఆమెకు మన దేశం తరఫున వెండి నెమలి, కాకతీయ తోరణం, చార్మినార్ లాంటివి కానుకలు ఇచ్చారు. అలాగే.. ప్రధాని మోదీకి వెండి హంస జ్ఞాపిక... మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, అమితాబ్ బచ్చన్, రతన్టాటా.. తదితర ప్రముఖులు హైదరాబాద్కు వచ్చినప్పుడు అలాంటి వెండి కానుకలు అందుకొని మురిసిపోతుంటారు. వాళ్లందరినీ అంతలా ఆకట్టుకున్న ఆ వెండి వస్తువులు.. తరాల చరిత్ర కలిగిన కరీంనగర్ ఫిలిగ్రి కళాకృతులే. ఏకాగ్రత, ఓపికతో వీటిని రూపొందించే హస్తకళా నైపుణ్యం అక్కడి స్వర్ణకారులకే సొంతం. దాదాపు 400 ఏళ్ల క్రితం పుట్టి... ఖండాంతరాలకు విస్తిరించించిన ఈ కళ తెలుగు వారికే గర్వ కారణంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఈ నగిషీలను వాళ్లెలా తయారు చేస్తున్నారు ? తెలంగాణాకే తలమానికంగా ఉన్న ఈ కళాకృతుల ప్రత్యేకతేంటి ?
#IdiSangthi
15 сен 2024