2024 టీ 20 ప్రపంచ కప్ లో భారత్ జయకేతనం ఎగరేసింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో, దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చిత్ర పరిశ్రమలోనూ జోష్ కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. టీమ్ఇండియాపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘భారత్ ప్రపంచంలో టాప్లో ఉంది. 17 ఏళ్ల తర్వాత టీ 20 వరల్డ్ కప్ గెలవడం ఆనందంగా ఉంది. విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్, అక్షర్, అర్షదీప్, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ వావ్ అనిపించింది అన్నారు. ‘‘విజయం మనదే. అలుపెరగకుండా పోరాడిన టీమ్ఇండియాకు అభినందనలు. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చరిత్రాత్మక విజయం చూస్తే ఎంతో గర్వంగా ఉందంటూ సూపర్స్టార్ మహేశ్బాబు సంతోషం వ్యక్తం చేశారు.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#t20worldcup2024 #RohitSharma #indiavssouthafrica #tv9sports #t20worldcup
Credit: #Rajeswari/Producer || #TV9D
2 окт 2024