మొక్క నాటిన పదిరోజులు ఉంటే 30 రోజుల నీరుని నేరుగా పేర్లు ఉండే ప్రాంతానికి సరఫరా చేయడం వల్ల నీటి వృధాను అరికట్టి 30-50 శాతం వరకు నీటిని పొదుపు చేయవచ్చు.అతి తేలికైన, ఇసుక, బరువైన నల్ల రేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలు గా వుండే భూమి, చదును చేయుటకు వీలు లేని భూముల్లో కూడా బిందు సేద్య అనుకూలం. సరైన తేమ, సమపాళ్ళలో పోషక పదార్ధాలు సక్రమం గా అందడం వలన మొక్కలు ఏపుగా పెరిగి, త్వరితం గా పక్వానికి వచ్చి అధిక దిగుబడులు (30-50%) పొందవచ్చు.
నీటి వాడకం తగ్గడం వలన నీరు తోడడానికి అవసరమయ్యే విద్యుత్ శక్తి ఆదా అవుతుంది. పోషక పదార్ధాలను నీటిలో కరిగించి (ఫెర్టిగేషన్)నేరుగా మొక్కల వ్రేళ్ళకు అందించడం వలన ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరిగి (80-90%) దాదాపు 20-40 శాతం ఎరువులు ఆదా అవుతాయి.నేలను చదును చేయడం, కాల్వలు కట్టడం, గట్లు వేయడం, బోదెలు చెయడం.
నీటిని పారించడం లోనే కాకుండా ఎరువులను వేయడం లో కూడా విప్లవాత్మక మార్పులు తెచ్చినప్పుడే డ్రిప్ సేద్య ప్రయోజనాన్ని పూర్తిగా పొందే అవకాశముంది.ఎరువు అందించే పోషకాల ఆధారం గా వీటిని మూడు రకాలు గా విభజించ వచ్చు.
17 фев 2024