హ్యాట్సాఫ్ అన్న నీకు ఎన్నో పాటలను నిజాలను నిర్భయంగా రాస్తు, పాడుతున్నవ్ అన్న నీకు నా కళాబివందనాలు అన్న జై భీమ్ జై రాజ్యాంగం. ప్రజల పాట సుక్క రాంనర్సన్న
దీనెమ్మ....ఒక్కో అక్షరం...ఒకొక్క పదం.. ఒక నిప్పు కణం లా వుంది... సోదరా.... నిజం గా మంద కృష్ణ అన్న మంది కృష్ణ కాదు అనుకున్నాం... అద్భుతమైన పాట... పాటకు ... ప్రశ్నకు మరణం లేదు...జై భీమ్..జై మాదిగ
కొట్లది మంది మాదిగలా గుండె దరువు పాట రూపంలో వినిపించిన , రామ్ నర్సియా నీకు నీకు పాధాభివంధనం🙇🙇, మీ పాట ఏది విన్న నా రోమాలు నిక్క పొడుచుకుంటాయ్ అన్నా, మీ లాంటి ప్రజా గాయకుడు మాకు కావలి, మీ పాటతో తప్పని ప్రశ్నించాలి, జై భీమ్
చుక్కా రామ నరసయ్య 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న నాయకులకు దండోరా ఎటువైపు వెళ్తుందో కళారూపంలో దండోర వేసి మాదిగల ఆత్మగౌరవం కోసం పాడిన పాట బాగానే ఉన్నది
అడ్డదారి పడుతున్న మాదిగ దండోరా అక్షర రూపం ఇచ్చావు అన్న.. మీ ప్రయత్నం అభినందనీయం .. మీరు ఇలాంటి సమాజాన్ని మేలుకోలిపే ప్రయత్నాలు ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను...
కొని సంవత్సరల మాదిగల యుద్ధం ఒక పాట పాడి మాదిగల అ యుద్ధం ని విమర్శిస్తున్నావ్ అన్న ఇది తప్పన్న సుక్క రామన్న 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ఇలాంటి పాటలు పాడకన్నా 🙏🏾🙏🏾🙏🏾😭😭😭😭😭😭😭
అన్నా మందకృష్ణ మాదిగరి కోసం ఎందుకులే గాని మనకోసం చెప్పన్నా మనకోసం మన స్వార్థం కోసం మనమే బాగుపడాలి కానీ మందకృష్ణ మాదిగ గారు. అలా కాదు.గత 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఎస్సీ ఉప కులాల వర్గీకరణ కోసం. ఆయనకి ఎంపీ సీటు ఇచ్చిన ఎమ్మెల్యే వచ్చిన వదులుకొని అన్ని వదులుకొని ఒక దళితుల కోసం పోరాడుతున్నారు కానీ మీరు ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నారు కానీ ఎస్సీ 65 ఉపకులాల కోసం పోరాడుతున్న మహా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. జై భీమ్
@@UNDRAJAVARAPUNAGARAJU-pw6lbMLA సీట్ ఎక్కడ వదులుకున్నడు? 2014 లో వర్ధన్నపేట నుండి పోటీ చేసి రాష్ట్రం లోనే రెండవ అత్యధిక మెజారిటీ 80000 పైచిలుకు ఓట్లతో ఓడిపోయిండు ప్రజలకు కూడా మంచి అవగాహనా ఉంది మందకృష్ణ మీద
ఎక్సెలెంట్ సాంగ్ బ్రదర్ 👌 మాదిగల ఆత్మగౌరవాన్ని నిలుపుకునే పాట.... మాదిగల మనసులోని భావాలు బయల్పడిన పాట....❤ ఒకవైపు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసి ప్రభుత్వ ఉద్యోగం ఒక కలగానే ఉన్న దశలోఉంది... మేధావులు అంతా ఆలోచించాల్సిన తరుణం ఇది....
తమ్మీ పాట ను ప్రాణం పెట్టీ పడినవు మా అందరి గుండె మంట నీ పాటతో బాంబు వోలె పెల్చినవు రం నర్సయ్య తమ్మీ హ్యాట్సాఫ్ జాతి కి పడే కడుత అంటే నేను పాట కదుత ఎంత గొప్ప మాట నీది
ప్రతిఫలం కోసం కాళ్లు మొక్కే దిగజారుడు పనులు మేము చేయలేం ఎందుకంటే మేము ఆది జాంబవుని వారసులం.. జంబుద్వీప రాజులం.. అణగారిన వర్గాలకు పెద్దదిక్కులం.. ఆత్మ గౌరవాన్ని అమ్ముకొని బతికే పరిస్థితుల్లో మేము లేము.. అభివృద్ధి ఫలాలు అందడం కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం.. వాగ్దానాలు, హామీలు విని విని విసిగి వేసారి పోయాము.. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ఎన్నికలకు ఏమిటి సంబంధం? ఒక్క తెలంగాణ లో ఉన్న మాదిగ మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగితే మిగతా రాష్ట్రాల సంగతి ఏంటి? మాదిగల మీద ప్రేమ బిజెపి పార్టీకే అంతా ఉంటే అధికారంలోకి వచ్చిన 100 రోజుల వ్యవధిలో వర్గీకరణ చేస్తామన్న బిజెపి పార్టీ 9 సంవత్సరాలకు పైగా గడిచిన ఎందుకు చేయలేదు? మాదిగల మీద అంత ప్రేమ ఉంటే మందకృష్ణ మాదిగను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి. ఆయనను తెలంగాణ బిజెపికి అధ్యక్షుడిని చేయండి. ఎన్నికలు వచ్చాయని ఎన్నికల్లో ఎత్తుగడలో భాగంగా ఎస్సీ వర్గీకరణ అంటే ఎమ్మార్పీఎస్ ఉద్యమం బయటికి మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ మనసులో ఎంత మాత్రం ఇష్టం లేదు.. మనకు వర్గీకరణ కావాలంటే కొట్లాడి తెచ్చుకోవాలి.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కాదు.. మాదిగలను ఒక్కతాటిపై తెచ్చి 30 ఏళ్లుగా ఉద్యమాన్ని చేస్తున్న మహా జననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పోరాటం మహోన్నతమైనది.. కానీ వర్గీకరణ పై మాటలు మాత్రమే చెప్పారు చేతలు చేయలేదు బిజెపి పార్టీ వాళ్లు.. వర్గీకరణ చేశాక సపోర్ట్ చేయమంటే బాగుండేది.. ఏమీ కాకముందే సపోర్ట్ చేయమంటే అది కేవలం మాదిగ, మాదిగ ఉపకులాల ఓట్ల కోసం మాత్రమే.. వాస్తవాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని మనవి.. 2023 వ సంవత్సరంలో కూడా నీటి బుడగల లాంటి మాటలు నమ్మి మోసపోవద్దు.. జై భీమ్
అన్నగారు నమస్కారం, మీ వ్యాఖ్యానం పూర్తిగా చదివాను, నాకు రెండు మూడు సందేహాలు వున్నవి, దయచేసి విని విలు అయితే సమాధానం చెప్పండి, మొదటిది మీరు ఆదిజాంభవుని వారసులం అన్నారు దానికి ప్రామాణికం ఏంటి,పురాణాలే కదా,అవి మనువాదులు రాసినవి మాకు అవసరం లేదు మేము నమ్మము అంటున్నారు రాంనర్సు అన్నగారు, ఇక రెండవది వర్గీకరణ కు తెలంగాణ ఎన్నికలకు సంబంధం ఏమిటి అన్నారు ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడి ప్రభుత్వం తీర్మానం చేసి పంపుతుంది ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం కూడా అవసరం అదీ కాక పార్లమెంట్ లో బిల్ పాస్ అవాలి అంటే దిగువ సభ, ఎగువ సభ, రెండింటి లో పాస్ అవాలి లోక్ సభలో అవుతుంది కానీ రాజ్య సభలో కావాలంటే మెజారిటీ కావాలి అవి లోక్ సభ ఎంపి లతో పాటు ఎమ్మెల్యే లు కూడా వారిని ఎన్నుకోవాలి మరి ఇక్కడ మనవాళ్ళు లేకపోతే ఎవరు ఎన్నిక అవుతారు మెజారిటీ ఎలా వస్తుంది,ఇక మూడవది మంద కృష్ణ మాదిగ గారు ఎంతో పోరాట అనుభవం ఉన్న నేత ఆయనకు తెలియదా, ఆయనకు తెలియదా తనను కానీ తన వర్గం వారిని గానీ సీఎం చేయించాలని ఆయన ప్రెస్మీట్ లలో ఎం చెబుతున్నాడో ఒకసారి వినండి, ఆయనకు అధికారం కంటే తన జాతి వర్గీకరణ, తన జాతి మనుగడ ముఖ్యం అని కాదు అంటారా మీరు చెప్పండి,ఒక వేళ ఆయననే సీఎం అభ్యర్థి గా ప్రకటించిన అధికారం లోకి రాకపోతే తరువాత ఏం చేయగలరు మీ దగ్గర ఇంతకు మించిన పరిష్కారం ఏమైనా వుందా........................................దయచేసి అన్యదా భావించకండి మీ సోదరుడు ....కిరణ్ కుమార్
బీజేపీ ని బొంద పెట్టాలి అన్నది మన అన్నా కదా బ్రదర్.. కాసేపు నువ్వు అనుకున్నది కాసేపటికి నిజమే అనుకుందాం కానీ నువ్వు చెప్పు తెలంగాణా లో బీజేపీ గెలుస్తదా చెప్పు.. సాక్షత్తు వర్ధన్నపేట లో మంద కృష్ణ అన్న నే ఓడిపోయాడు.. బీజేపీ కి సడన్ గా ఓటు వెయ్యమంటే వెయ్యరు అన్న.. అవకాశ వాదం తెలియని బిడ్డలు ఎవరైనా ఉన్నారు అంటే అది మాదిగ బిడ్డలు మాత్రమే.. కొట్లాడి వర్గీకరణ సాధించాలి.. కానీ ఏళ్లకు తరబడి మనలను హింసలకు గురి చేసిన వారికి వత్తాసు పలకడం అవసరం లేదు... ఆకలి వేసిన వాడు ఒక పూట పస్తులు ఉండడానికి అయినా ఇష్టపడతాడు కానీ కాళ్లు మొక్కి అన్నం పెట్టమని అడగడు.. అలాగే మనకు వర్గీకరణ అవసరమే కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఎంతైనా లేదు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న బీజేపీ పార్టీకి 10 సంవత్సరాల నుంచి సోయి ఎందుకు లేదు అన్న.. వెయ్యికి పదివేల శాతం తెలంగాణలో బిజెపి గెలవదు.. డిసెంబర్ 3 వరకు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది అన్న.. మన జాతిలో మనవాళ్ళకే గొడవపెట్టి నవ్వుకుంటూ ఉండే వాళ్లకు సపోర్ట్ చేయడం చాలా కష్టం..
కోట్లాది మంది మాదిగలు కోపాని నీ పాట రూపంలో ఎంతో ధైర్యంగా పడినవ్ అన్న...... మంద కష్ణమాదిగ అన్న గారి వెంట బీజేపీ కి జై కొట్టే కొడుకులు ఈ పాట విన్నాక మార్పు వస్తది ......
. జాతిలో చదువుకున్న యువతకు ఏబిసిడి వర్గీకరణ అవసరమే, ఈ విషయంలో కృష్ణన్న సైద్ధాంతికాకంగా మతోన్మాదులతో చేతులు కలపడం సమంజసమే, సైద్ధాంతికంగా కృష్ణన్న చేతులు కలపడాన్ని, సిద్ధాంత పరంగా రామ్ నరసన్న విమర్శించడం కూడా సమంజసమే. ఒకరు సైదాంతికంగా మరొకరు సిద్ధాంతపరంగా వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించడం భారత రాజ్యాంగం 19 నుండి 22 అధికరణాలు ప్రాథమిక హక్కుల రూపంలో అవకాశాలు కల్పించాయి. కృష్ణన్న శాంతంగా ఉన్నాడు అంటే రామ నరసన్న అభిప్రాయాన్ని గౌరవించాడని అర్థం. కృష్ణ అన్నకు రామ్ నరసన్నకు వారిరువురికి ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగం పైన మౌలికంగా స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా ఉండడమే సమంజసం.
చుక్క రామ నర్సయ్య గారికి జై భీమ్ ఈ పాట చాలా నిజాయితీగా నిర్భయ సమాజాన్ని తట్టి లేపే విధంగా మన శత్రువును గుర్తించే విధంగా మందకృష్ణ కు మురుకులు గుర్తు చేసే విధంగా పాడినందుకు నీకు వేల వేల దండాలు .జై భీమ్, జై భారత్ ,సేవ్ కాన్స్టిట్యూషన్. పట్నం చెన్నయ్య దళిత పాంథర్స్ సొసైటీ తెలంగాణ.
మాదిగ తమ్మునికి వాటా పెట్ట నీయని, మొదటి శత్రువు, మను, మాల సోదరులు.మనువాదులను కట్టిబెట్టి, రిజర్వేషన్లు తెచ్చి పెట్టినవాడు అంబేద్కర్.ఆ ఫలాలు పెట్టని అచ్ఛమైన మను మాలలు. కృష్ణన్న అమ్ముడై పోలేదు. మాదిగ జాతి ఐక్యత కు ఎదురు తిరిగి మాలలకు అమ్ముడైపోయే వారే జాతి ద్రోహులు.వాటాలు పెట్టని వాడు, ఐక్యుడా?ఈ పాట ఎవరు వ్రాయించుకొన్నారో గ్రహించగలం. కుట్ర. జై భీమ్ అన్నప్పుడు జై మాదిగ జై దండోరా అంరేం. అమ్ముడై పోయింది, కృష్ణన్నకాదు ఆయన త్యాగమూర్తి. సమస్త మాదిగ సంఘాల మూల ఉద్దేశం abcd వర్గీకరణ. అందుకు దెబ్బ తీసే వారు మాదిగలవ్వరు. దండోరా యుద్ధము Abcd కోసం. అట్టి అధికారం Bc కులం వాడైనా, మోడీ బృందం చేతిలో ఉంది. మోడీ వా? వాటాపెట్టని, మాలలు, మనువులా? నీవు మాదిగయితే, మాలల స్వార్థం పై వ్రాసి, పాడు.
వర్గీకరణ జరుగుతే మేలుజరుగుతాధి అనుకుంటే జరగాలని కోరుకునే నేను ఒక మీ మాల సోదరుని కానీ ప్రతి ప్రభుత్వ వ్యవస్థ ప్రయివేట్ అయితుంటే దాని గుంరుంచి కూడా ఉద్యమాన్ని ఎందుకు ముందుకు నడుపుతాలే అన్ని రంగాలలో అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతుంది దాని గురుంచి మనమనందరం మాల మాదిగ వేరు కాదు అందరం ఒక్కటే తిరగబడి పోరు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత జెనరేషన్ డబ్బు ఉన్నోడు లెనోడు 2 వర్గాలు ప్రాముకంగా హైటెక్ జెనరేషన్ లో కూడా మళ్లీ తాతల ముత్తత్తాల గడిలా పాలన రాబోతుంది మనం మళ్ళీ దుర్భర స్థితి కి చేరబోతున్నాం దయచేసి కులాలు పక్కన పెట్టి మనమందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది జై భీం జై పూలే జై పెరియర్ జై సాహు మహరాజ్ జై కాన్షిరం జై శివాజీ జై జై భీం
Manda Krishna gari decision 100% correct we are supporting to Manda krishna madiga garu .... he is always right... Tq Respected honorable PM...sir U stand for ur promise...thanking you dir👍💪✌
రామ్ నరసన్నా మందకృష్ణ అన్న ఎటువంటోడో 30 ఏళ్లుగా చూస్తున్నాం ఏదో ఒక సామెత అంటారు కదన్నా 1000 సార్లు సాయం చేసినా ఒక్కసారి సాయం చెయ్యకపోతే 1000 సార్లు చేసిందంతా మరిచిపోతారంట. నీ పాట లో న్యాయం ఉందన్న బారాబర్ అందరి ప్రశ్న నీ నువ్వే అడిగినవ్ కానీ....... వర్గీకరణ చేస్తా అని అన్నందుకే ఇదంతా చేసిండు మందకృష్ణ అన్న కానీ పదవులే ముఖ్యం లేదా మనువాదపు సంక ఎక్కి ఊరెగాలని అనుకుంటే ఏ పార్టీ ఆయనకు ఆఫర్ ఇవ్వనిది అన్ని పార్టీలు ఇచ్చినాయి కానీ వర్గీకరణ కోసమే 30 ఏళ్లుగా పాటుపడిండు వర్గీకరణ జరుగుతే మనకు మంచి జరుగుతుంది అని కదనే అన్న ఆలోచించింది. మన మనిషే అన్న మనకోసమే పోరాడుతున్నాడు ఏదో ఒక చిన్న ఆశ వర్గీకరణ జరుగుతుంది అని లేకపోతే ఈ మోడీలు కెసిఆర్ లు ఎంత అయన ముందు. కానీ పాట మాత్రం మస్తు ఊపుమీద పడినవే అన్న 🙏🙏
సాంగ్ చాలా బాగుంది అన్న ఈ పాట మొత్తంలో మందకృష్ణ మాదిగ మీద మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమైంది మతతత్వ పార్టీలకు మద్దతు ఇవ్వడం ఏంది అనేది మీతో పాటు నా ఉద్దేశం కూడా అదే