రసాయనాలతో పండించే ఆహార పదార్థాలను తినడంవల్లనే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్వలి స్పష్టం చేశారు. రైతునేస్తం ఫౌండేషన్ మరియు తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం సంయుక్తంగా అక్టోబరు 7న హైదరాబాద్లోని సికింద్రాబాద్లోగల హరిహరకళాభవనంలోనిర్వహించిన "సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకప్పుడు అరుదుగా కనిపించే బుద్ధిమాంధ్యం, క్యాన్సర్ లాంటి అనారోగ్య సమస్యలు ఇప్పుడు వేలాదిమందిలో కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
9 окт 2018