మాంసాహార బజ్జి,బోండాల శాలలు పాండిచ్చేరి నగరంలో విరివిగా కనిపిస్తాయి.వాటిలో గుర్తింపు పొందిన ప్రదేశం గత 46ఏళ్ళగా రాజమ్మ గారు నిర్వహణ చేస్తున్న పాండి పాటి బజ్జి కడై.ఈ ప్రాంత ప్రసిద్ధి చెందిన ఆహార శాలలు గురించి శోధన చేసినా లభించు సమాచారంలో ప్రముఖంగా ఉంటుంది రాజమ్మ గారి ఆహార కేంద్రం.
దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ పోషణ భారమై క్లిష్ట పరిస్థితులు నెలకొనడంతో స్వయం ఉపాధి కోసం ఈ శాల ప్రారంభించిన రాజమ్మ గారు.రుచికరమైన చేప, రొయ్యల బజ్జిలు తయారు చేసి ఆత్మీయంగా అందించ సాగారు.
ఈ తరహా ఆహారాన్ని ఇక్కడి వారికి పరిచయం చేయడమే కాకుండా మరికొందరికీ తయారీ విధానం నేర్పి ఉపాధి చూపారు.
వృత్తి పట్ల వారి అంకితభావాన్ని గుర్తించిన ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు.ఆ తరుణంలో ప్రసిద్ధులైనారు.
ఇక్కడ ఆహార స్వభావాన్ని ఇప్పుడు వివరిస్తాను.
ఉడికించిన రొయ్యలకు బియ్యం పిండి మరియు ప్రత్యేక మసాలా పట్టించి చివరిగా శనగ పిండి జత పరిచి నూనెలో వేగించి అందించారు. తినగా దోరగా కాలిన పై మిశ్రమం కరకరలాడింది.తర్వాత రొయ్య మెత్తగా నలిగింది.దానికీ అంటి ఉన్న మసాలా ఊరించింది.క్రమంగా ఉపాహారంలో ఇమిడి ఉన్న అసలు రుచి లభించింది.
రుచిగల కొడువ చేప,ముడి పదార్థాలతోపాటు ముఖ్యంగా వేగించిన తీరు కారణం గా
చేప బజ్జి ద్రవ,ఘన రూపంలో ఉంది తింటున్నప్పుడు.చిత్రీకరణ సమయంలో తిన్న తాలూకా అనుభూతి ఇప్పుడు గుర్తుకు వస్తుంది.
14 окт 2022