గ్రామీణ నేపథ్యం గల వారు రాణెమ్మ గారు.కనుక పల్లె రుచుల తీరు చేకూరేలా మసాలాలు సొంతంగా తయారు చేసుకుని మితంగా వినియోగించి వంటకాలు సిద్ధం చేస్తారు నిత్యం రాణెమ్మ గారు.అలా గుర్తింపు పొందారు వారు.
వారి ఆహారశాలలో ఉదయం అల్పాహారాలతో వివిధ మాంసాహార వంటకాలు, మధ్యాహ్నం రాగి సంగటి,పుష్క, బిర్యానీతోపాటు అనేక ఆహార పదార్థాలు లభిస్తాయి.
ఉదయం అల్పాహారాలలో
కోడి గుడ్డు దోశ తో కోడి కూర ,ఇడ్లీతో పొటేలు కూర ఇక్కడ ప్రసిద్ధి పొందిన ఆరగింపు.
అట్టి ఆహారాల తీరు మీతో పంచుకుంటాను.
పెద్ద పరిమాణంలో విస్తరించిన ముడి పిండికి కలగలిపిన కారం గుడ్డు మిశ్రమాన్ని బాగా దిద్ది చక్కగా కాల్చిన దోశ.కట్టెల పొయ్యి మీద తయారు చేసిన కారణంగా వాస్తవిక రుచితో ప్రత్యేకంగా ఉంటుంది.
గుడ్డు దోశకు మెత్తటి ముక్కలతో కాస్త పులుసుగా ఉన్న కోడి కూరను మిళితం చేసుకుని తింటున్న వేళ రెండు సంయుక్తమై వైవిధ్య రుచిని వ్యక్తం చేస్తాం.
పొటేలు కూరలో పులుసు
పరిధి విసుమంత. ముక్కలకు గుజ్జు ఉంటుంది. ఇడ్లీకీ ఆ మసాలా పులిమి ముక్కను ఉంచి నోటికి అందిస్తే సంతృప్తులవుతాం.గమనించగలరు ఇవి బియ్యం పిండితో చేసే ఇడ్లీలు.
ఆహార శాల వేళలు,ఉదయం, మధ్యాహ్నం ఇక్కడ ఏమి వడ్డిస్తారు వంటి అనేక విషయాలను
ఇప్పుడు రాణెమ్మ గారు వివరిస్తారు.
చిరునామా:-విద్యా నగర్, తిరుపతి.
g.co/kgs/Fpjxjy
11 июл 2022